News October 17, 2025
కేయూ రిజిస్ట్రార్కు జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసులు

కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రంకు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేయూలో తాత్కాలిక
ప్రొఫెసర్గా పని చేస్తున్న పోరిక రమేశ్ తనను యూనివర్సిటీలోని అధికారులు వేధిస్తున్నారని జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కమిషన్ రిజిస్ట్రార్ను వివరణ కోరుతూ 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.
Similar News
News October 18, 2025
రోగులపై సేవా భావాన్ని కలిగి ఉండాలి: ఖమ్మం కలెక్టర్

వైద్య వృత్తి పవిత్రమైందని, రోగుల పట్ల సేవా భావాన్ని వైద్యులు కలిగి ఉండాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. శనివారం కలెక్టర్, ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించిన 2025-వైట్ కోట్ సెర్మనిలో పాల్గొన్నారు. వైద్య వృత్తి ఎన్నుకున్న విద్యార్థులు అకాడమిక్స్లో పట్టు సాధించడంతో పాటు మానవ శ్రేయస్సు కోసం ప్రయత్నించాలని, మన దగ్గర వచ్చే రోగులకు పేద, ధనిక భేదం లేకుండా వారికి చికిత్స అందించాలన్నారు.
News October 18, 2025
ఆటోలు గుద్దుకున్నా ఛలో పోలీస్ స్టేషన్ అంటారేమో: విష్ణుకుమార్ రాజు

వైసీపీ స్థితిని చూస్తే బాధ కలుగుతోందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. రెండు ఆటోలు గుద్దుకున్నా ఛలో పోలీస్ స్టేషన్ అనే స్థాయికి దిగిపోయిందని ఎద్దేవా చేశారు. వైజాగ్ ఐటీ, ఐటీ అనుబంధ రంగాలకు బెస్ట్ డెస్టినేషన్ అవుతుందన్నారు. అదానీకి భూములు ధారాదత్తం చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల ప్రత్యక్షంగా 2వేల ఉద్యోగాలు, పరోక్షంగా వేలాది మంది ఉపాధి పొందుతారని వెల్లడించారు.
News October 18, 2025
‘మలబార్’కు పాక్ ఇన్ఫ్లూయెన్సర్ కష్టాలు

ధంతేరాస్ వేళ మలబార్ గోల్డ్&డైమండ్స్ వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఈ కంపెనీ లండన్లో తమ షోరూమ్ ఓపెనింగ్కు UK బేస్డ్ పాక్ ఇన్ఫ్లూయెన్సర్ అలిష్బా ఖాలీద్తో కొలాబరేట్ కావడమే అందుక్కారణం. గతంలో ఆమె Op సిందూర్ను ‘పిరికి చర్య’గా అభివర్ణించారు. దీంతో మలబార్ యాజమాన్యం పాక్ సానుభూతిపరులుగా వ్యవహరిస్తోందని నెటిజన్లు SMలో పోస్టులు పెట్టారు. సంస్థ బాంబే కోర్టుకెళ్లగా అలాంటి పోస్టులు తొలగించాలని ఆదేశించింది.