News October 17, 2025
లోకేశ్కు కర్ణాటక మంత్రి కౌంటర్: YCP నేతలు

AP: పెట్టుబడులపై మంత్రి లోకేశ్ చేసిన <<18020050>>స్పైసీ ట్వీట్<<>>కు కర్ణాటక IT మంత్రి ప్రియాంక్ ఖర్గే కౌంటర్ ఇచ్చారని YCP నేతలు చెబుతున్నారు. ‘అందరూ స్పైసీ ఇష్టపడినా, బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. పొరుగువారి అప్పులు రూ.10లక్షల కోట్లకు పెరిగాయి. ఏడాదిలోనే రూ.1.61లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. రెవెన్యూ లోటు మరింత దిగజారి 2.65%-3.61%కి పెరిగింది’ అని ఖర్గే ట్వీట్ చేశారు.
Similar News
News October 18, 2025
కెప్టెన్సీ కోల్పోతాననే భయం ఉంది: సూర్య

కెప్టెన్సీ కోల్పోతాననే భయం తనలో ఉందని IND T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించారు. T20లకూ గిల్ను కెప్టెన్ చేస్తారన్న ఊహాగానాలపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘నేను అబద్ధం చెప్పను. భయం ఉంటుంది. అదే నాకు మోటివేషన్. హార్డ్వర్క్ చేస్తూ నిజాయతీగా ఉంటే మిగతావన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. టెస్ట్, వన్డేలకు గిల్ కెప్టెన్ అవడం పట్ల హ్యాపీగా ఉన్నా. మా మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది’ అని పేర్కొన్నారు.
News October 18, 2025
రుషికొండ ప్యాలెస్ వినియోగంపై తర్జనభర్జన

AP: విశాఖలోని <<17985023>>రుషికొండ<<>> ప్యాలెస్పై వివిధ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. అంతర్జాతీయ కాన్సులేట్లు ఏర్పాటు చేయాలని ఏపీ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ సూచించింది. ఏపీ నుంచి వేలాది మంది US, UAE సహ పలు దేశాల్లో నివసిస్తున్నందున NRI సేవలు సులభమవుతాయంది. లేకుంటే అంతర్జాతీయ హోటళ్లు నెలకొల్పాలని పేర్కొంది. దాదాపు ₹500 Crతో కట్టిన ఈ ప్యాలెస్ వినియోగం లేకపోగా, నిర్వహణ ఖర్చులకు నెలకు ₹25లక్షలు అవుతోంది.
News October 18, 2025
అఫ్గాన్ ఆడకున్నా సిరీస్ కొనసాగుతుంది: PCB

పాక్ వేదికగా జరిగే ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి <<18038169>>తప్పుకుంటున్నట్లు<<>> అఫ్గాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరీస్ షెడ్యూల్ ప్రకారమే (Nov 17-29) కొనసాగుతుందని PCB వెల్లడించింది. అఫ్గాన్ స్థానంలో ఇంకో జట్టును ఆడించేందుకు పలు బోర్డులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు PCB వర్గాలు తెలిపాయి. పాక్, శ్రీలంకతోపాటు మూడో జట్టు పేరు ఖరారు కాగానే అధికారికంగా వెల్లడిస్తామని చెప్పాయి.