News October 17, 2025

ధర్మపురి: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

image

ధర్మపురి పట్టణంలోని కస్తూర్బా పాఠశాలను శుక్రవారం కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. పాఠశాల ఆవరణలో గల ఖాళీ స్థలంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ, డీఈఓ, తహశీల్దార్ తదితరులున్నారు.

Similar News

News October 19, 2025

పోలీసు స్టేషన్‌లను తనిఖీ చేసిన ఎస్పీ

image

SP సతీష్ కుమార్ శనివారం రాత్రి పుట్టపర్తి అర్బన్, బుక్కపట్నం, కొత్తచెరువు ఆఫ్ గ్రేడ్ పోలీస్ స్టేషన్లతో పాటు జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరాల నియంత్రణ, అక్రమ రవాణా, ప్రజల భద్రత, అసాంఘిక కార్యకలాపాలు పూర్తిగా అరికట్టే దిశగా దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. రాత్రిపూట పోలీసుల గస్తీ, పెట్రోలింగ్, తనిఖీలు చేస్తున్నారా అని స్వయంగా పరిశీలించడానికి తనిఖీలు చేపట్టామన్నారు.

News October 19, 2025

ADB: చివరి రెండు రోజులు పోటెత్తారు!

image

మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలకు పెంచడంతో జిల్లాలో ఈసారి 711 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతంలో 1047 వచ్చినా, ఫీజు పెంపుతో ప్రభుత్వానికి రూ.21.33 కోట్ల ఆదాయం సమకూరింది. గతంతో పోలిస్తే రూ.39లక్షలు ఎక్కువ. ఉట్నూర్ ఎసైజ్ స్టేషన్ పరిధిలో 39వ షాపునకు అత్యధికంగా 25 దరఖాస్తులు వచ్చాయి. 9 షాపులకు రీ-టెండర్ అవకాశం ఉండగా, 3రోజుల క్రితం100లోపే దరఖాస్తులుండగా.. చివరి 2 రోజుల్లో భారీగా వచ్చాయి.

News October 19, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో రేపు PGRS రద్దు

image

ప్రతి సోమవారం కలెక్టరెట్లో నిర్వహించే PGRS కార్యక్రమం ఈనెల 20న (సోమవారం) దీపావళి పండగ సందర్భంగా రద్దు చేసినట్లు పార్వతీపురం మన్యం కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి ప్రకటించారు. ఆపై సోమవారం నుంచి PGRS యధావిధిగా జరుగుతుందని తెలిపారు. ఈవారం PGRS రద్దు విషయాన్ని అర్జీదారులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.