News April 8, 2024
BRS కంటోన్మెంట్ టికెట్.. ఆ ముగ్గురికి మళ్లీ నిరాశే!

BRS కంటోన్మెంట్ టికెట్ ఆశిస్తున్న ముగ్గురు లీడర్లకు మళ్లీ నిరాశే ఎదురైంది. గజ్జెల నగేశ్, మన్నె క్రిశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో TDP నుంచి గెలుపొందిన సాయన్న ఆ తర్వాత BRSలో చేరారు. 2018లో సాయన్నకే KCR టికెట్ ఇచ్చారు.ఆ తర్వాత ఆయన చనిపోవడంతో, 2023 ఎన్నికల్లో సాయన్న బిడ్డ లాస్య నందితకు టికెట్ ఇవ్వగా ఆమె చనిపోయారు. తాజాగా నివేదితకు టికెట్ ఇవ్వనున్నారు.
Similar News
News April 21, 2025
HYD: విభిన్న వాతవరణం.. 3 రోజులు జాగ్రత్త..!

హైదరాబాద్లో రోజు రోజుకూ ఎండలు ఎక్కువవుతున్నాయి. HYD, MDCLలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల వరకు నమోదవుతోంది. మధ్యాహ్నం వరకు ఎండ కొడుతుండగా, సాయంత్రం వర్షం పడుతోంది. ఉదయం 7 గంటల నుంచే వేడిమి అధికంగా ఉంటుంది. నేటి నుంచి మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాక గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు చేరనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
News April 21, 2025
HYD: అర్ధరాత్రి యువతిని కాపాడిన పోలీసులు

ఆత్మహత్య చేసుకుందామని యత్నించిన యువతి ప్రాణాలను పోలీసులు కాపాడారు. స్థానికుల వివరాలు.. రాత్రి 11:30 సమయంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి ఓ యువతి దూకబోయింది. ఇదే సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు వెంకటేశ్, కృష్ణయ్య అప్రమత్తమయ్యారు. చెరువులో దూకే చివరి నిమిషంలో ఆమెను అడ్డుకొని బ్రిడ్జి మీదకు తీసుకెళ్లారు. ఆమెను రక్షించి, కౌన్సెలింగ్ ఇచ్చారు.
News April 21, 2025
డబుల్ ఇంజిన్ సర్కారుతో HYD అభివృద్ధి.. మీ కామెంట్?

TGలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే నగర అభివృద్ధి సాధ్యమని ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. HYD MLC ఎన్నికల వేళ ఆయన కాంగ్రెస్, BRS, MIMపై తీవ్ర విమర్శలు చేశారు. మజ్లీస్ పార్టీ కోసం ఈ రెండు ప్రధాన పార్టీలు పోటీ చేయడం లేదన్నారు. HYDను బలిచేసేందుకు INC, BRS వెనుకడుగువేయడం లేదని ఆరోపించారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోటీ చేస్తుంది BJP ఒక్కటే అంటోన్న కిషన్ రెడ్డి ప్రసంగంపై హైదరాబాదీ మీ కామెంట్?