News October 18, 2025
HYD: నిజాంపేటలో చిట్టీల పేరుతో రూ.150 కోట్లు స్వాహా

చిట్టీల పేరుతో డబ్బులు స్వాహా చేసిన ఘటన HYD నిజాంపేట పరిధిలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. నిజాంపేటలో రేష్మ, అలీ అనే దంపతులు క్లినిక్ నడుపుతున్నారు. దీంతో పాటు చిట్టీలు నిర్వహించేవారు. అయితే సుమారు 100 మంది నుంచి రూ.150 కోట్ల వరకు వసూలు చేసిన రేష్మ దంపతులు పరారయ్యారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు PSను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Similar News
News October 21, 2025
HYD: పోలీస్ బాస్.. మీ సేవలకు సెల్యూట్

నిజాయితీకి ప్రతీక, ధైర్యానికి పర్యాయపదం ఉమేశ్ చంద్ర ఐపీఎస్. వరంగల్లో ASPగా నక్సలైట్లను అణచివేశారు. కడప SPగా ఫ్యాక్షన్ను కట్టడి చేసి ‘కడప సింహం’గా ఖ్యాతి గడించారు. కరీంనగర్లో శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషించారు. చివరగా AIGగా సేవలందించారు. ప్రజల కోసం పోరాడి ‘ప్రజల పోలీస్’గా పేరుగాంచారు. ఆయన బదిలీ వార్తపై ప్రజలు రోడ్డెక్కి కన్నీరు పెట్టారు. 1999 SEP 4న HYD SRనగర్లో నక్సలైట్ల దాడిలో కన్నుమూశారు.
News October 21, 2025
HYD: పోలీస్ శాఖలో ‘టైగర్ జిందా హై’!

నిజాయితీ, అంకితభావంతో పనిచేసిన IPSలో KS వ్యాస్ ఒకరు. ASPగా కెరీర్ ప్రారంభించిన ఆయన నిజామాబాద్, నల్గొండ, విజయవాడలో SPగా పనిచేశారు. HYD ట్రాఫిక్లో కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. మావోయిస్టుల అణచివేత కోసం గ్రేహౌండ్స్ను స్థాపించారు. KS వ్యాస్ మీద కక్ష పెంచుకున్న నక్సల్స్ జనవరి 27, 1993న LB స్టేడియంలో కాల్చిచంపారు. కానీ, ఒక సీన్సియర్ IPS ఆఫీసర్గా పోలీస్ శాఖలో నేటికీ సజీవంగా ఉన్నారు.‘టైగర్ జిందా హై’!
News October 21, 2025
HYD: సెల్యూట్.. వీరులారా మీకు వందనం!

తెలంగాణ పోలీస్ శాఖ ఉలిక్కిపడిన ఘటన ఇది. మావోలు ఏకంగా పోలీస్ స్టేషన్ను పేల్చేశారు. ఇది జరిగి 28 ఏళ్లు గుడుస్తున్నా నేటికి అమరులైన పోలీసులే యాదికొస్తుండ్రు. 1997లో యాచారం PSలో జమీల్ అహ్మద్, రాజేశ్వర్ రావు కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. పథకం ప్రకారం మావోలు స్టేషన్ను పేల్చివేయడంతో విధి నిర్వహణలోనే ప్రాణాలు విడిచారు. పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు అమరులకు నివాళి అర్పిద్దాం.