News October 18, 2025

పాడేరు: అనారోగ్యంతో వ్యక్తి మృతి.. అంబులెన్సు సిబ్బంది నిర్లక్ష్యమే కారణం?

image

పాడేరు మండలం చౌడుపల్లికి చెందిన మాదెల రామ్మూర్తి అనారోగ్యానికి గురవడంతో పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడిని గురువారం రాత్రి వైద్యులు విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. రామ్మూర్తిని తరలించడంలో అంబులెన్సు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎట్టకేలకు వేరే అంబులెన్సులో విశాఖ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అంబులెన్సు సిబ్బంది లేట్ చేయడం వల్లే రామ్మూర్తి మృతి చెందాడని బంధువులు ఆరోపించారు

Similar News

News October 19, 2025

HYD: యూట్యూబర్లపై సైబర్ క్రైమ్ కొరడా

image

మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ ప్రచురించినందుకు గాను రెండు యూట్యూబ్ ఛానెళ్లపై POCSO చట్టం కింద కేసు నమోదైంది. నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో స్వేచ్ఛ ఉంది కదా అని చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ శాఖ హెచ్చరించింది.

News October 19, 2025

HYD: యూట్యూబర్లపై సైబర్ క్రైమ్ కొరడా

image

మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ ప్రచురించినందుకు గాను రెండు యూట్యూబ్ ఛానెళ్లపై POCSO చట్టం కింద కేసు నమోదైంది. నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో స్వేచ్ఛ ఉంది కదా అని చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ శాఖ హెచ్చరించింది.

News October 19, 2025

Alert: దీపావళికి స్వీట్లు కొంటున్నారా?

image

TG: దీపావళి పండుగ సందర్భంగా స్వీట్లు కొంటున్న వారికి అలర్ట్. రాష్ట్రంలోని పలు స్వీట్ షాపుల్లో సింథటిక్ కలర్స్, ఫేక్ సిల్వర్ ఫాయిల్, రీయూజ్డ్ ఆయిల్, కల్తీ నెయ్యి వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలింది. కనీస పరిశుభ్రత పాటించకుండా, కాలం చెల్లిన పదార్థాలతో స్వీట్లు తయారు చేస్తున్నట్లు వెల్లడైంది. దీంతో షాపుల్లో క్వాలిటీని చూసి స్వీట్లు కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.