News October 18, 2025

నేటితో ముగియనున్న జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలు

image

హనుమకొండలోని జేఎన్ఎస్‌లో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి అథ్లెక్స్ పోటీల్లో మూడో రోజు ప్రారంభమయ్యాయి. 5000 మీటర్ల పరుగు పందెంలో అథ్లెట్లు పాల్గొన్నారు. చివరి రోజు 23 అంశాల్లో పోటీలు జరగనుండగా,16 అంశాల్లో విజేతలెవరో వెల్లడిస్తారు. సెమీఫైనల్స్‌లో నెగ్గి ఫైనల్స్‌కు చేరుకున్న అథ్లెట్లంతా పతకాల వేట సాగించనున్నారు. ఫైనల్స్ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.

Similar News

News October 19, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 19, 2025

CBN విషయంలో తప్పని రియలైజ్ అయ్యాను: జోగి రమేష్

image

AP: గతంలో అసెంబ్లీ చంద్రబాబు బాధపడిన విషయంలో తాము తప్పు చేశామని తన భార్య చెప్పిందని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. అది తప్పని తర్వాత తానూ రియలైజ్ అయినట్లు తెలిపారు. తమ మధ్య రాజకీయ వైరమే ఉందని, ఇతర విషయాల్లో అందరిని గౌరవిస్తానని పేర్కొన్నారు. పార్టీ మారబోనని, YSR బ్రాండ్‌తో జగన్ వెంట కొనసాగుతానని తెలిపారు. నకిలీ మద్యం <<18043835>>కేసులో<<>> చంద్రబాబు తనపై కక్ష కట్టారని ఆరోపించారు.

News October 19, 2025

యాడికి: 11 మందిపై కేసు నమోదు

image

యాడికి మండలానికి చెందిన మహిళపై ఈనెల 4న అదే మండలానికి చెందిన విశ్వనాథ్ బలాత్కారం చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. 8న విశ్వనాథ్ తన సోదరులు, బంధువులతో బాధితురాలి ఇంటిపై దాడి చేసినట్లు ఆరోపించింది. దాడిలో బాధితురాలి భర్త నారాయణస్వామి, కొడుకు నవీన్ తీవ్రంగా గాయపడ్డారని చెప్పింది. ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేని, బాధితులు శనివారం డీఐజీని ఆశ్రయించడంతో పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేశారన్నారు.