News October 18, 2025

ఆధార్, వెబ్ ల్యాండ్ ఆధారంగా రబీ ఎరువుల పంపిణీ

image

AP: రబీ సీజన్ ఎరువుల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ నంబరు, వెబ్ ల్యాండ్‌లో రైతుకున్న భూకమతం ఆధారంగా.. పంటల వారీగా, అగ్రికల్చర్ యూనివర్సిటీ సిఫారసు మేరకు ఎరువులను అందిచనుంది. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ ఎక్స్అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ వెల్లడించారు. రబీ సీజన్ సాగు సన్నద్ధత, ఎరువుల పంపిణీ అంశాలపై శుక్రవారం జిల్లాల వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు.

Similar News

News October 18, 2025

68,900 అప్లికేషన్లు.. మరో 30 వేలు వచ్చే ఛాన్స్

image

TG: మద్యం దుకాణాలకు అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తులకు ఈ రోజు ఆఖరు తేదీ కావడంతో కొన్ని జిల్లాల్లో దరఖాస్తుదారులు బారులు తీరారు. వారందరికీ అధికారులు టోకెన్లు ఇచ్చారు. ఇప్పటివరకు 68,900 అప్లికేషన్ల ద్వారా రూ.2,067 కోట్ల ఆదాయం వచ్చింది. మరో 30 వేల దరఖాస్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ఆదాయం రూ.3 వేల కోట్లు దాటనుంది. గతంలో 1.03 లక్షల అప్లికేషన్ల ద్వారా రూ.2,600 కోట్లు వచ్చాయి.

News October 18, 2025

గ్రూప్-2 అభ్యర్థులకు 48hrs ముందే దీపావళి: CM

image

TG: గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి 48 గంటల ముందే దీపావళి వచ్చిందని CM రేవంత్ అన్నారు. HYDలో వారికి నియామక పత్రాలను అందజేశారు. ‘₹లక్ష కోట్లతో కట్టిన “కాళేశ్వరం” మూడేళ్లలోనే కూలింది. గత పాలకులు వారి కుటుంబాల కోసమే ఆలోచించారు. పదేళ్లలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేదు. తన ఫామ్‌హౌస్‌లో ఎకరా పంటపై ₹కోటి ఆదాయం వస్తుందన్న పెద్దాయన.. ఆ విద్యను ప్రజలకు ఎందుకివ్వలేదు’ అని ప్రశ్నించారు.

News October 18, 2025

ఈ పండ్లలో అధిక పోషకాలు

image

*ఆపిల్: ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
*అరటి- పొటాషియం, విటమిన్ B-6 వల్ల శక్తి అందుతుంది.
* జామ: విటమిన్ C, ఫైబర్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
*బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ: యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మంచివి.
*ఆరెంజ్: విటమిన్ C వల్ల ఇమ్యూనిటీ పెరగడంతో పాటు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
*దానిమ్మ, బొప్పాయి, కివీ, ఉసిరిలోనూ పోషకాలుంటాయి.