News October 18, 2025

మదనపల్లెలో దారి దోపిడీ

image

బెంగళూరు టు మదనపల్లెకు వచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారి దోపిడీకి గురయ్యాడు. బాధితుడు 1టౌన్ పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు.. సత్సంగ్ స్కూల్ దగ్గర ఉండే విజయ్ కుమార్ రెడ్డి బెంగళూరులో పని చేస్తాడు. శుక్రవారం రాత్రి ఆత్మకూరు బస్సులో వచ్చి 1 గంటకు నక్కల దిన్నెలో దిగాడు. నడచి వెళుతుండగా లిఫ్ట్ ఇస్తామని ఇద్దరు బైక్ ఎక్కించుకుని 15 గ్రాముల బంగారు, రూ.20 వేల నగదు దోపిడీ చేశారు.

Similar News

News October 18, 2025

HYDలో సూర్యాపేట జిల్లా వాసి SUICIDE

image

సూర్యాపేట జిల్లా ఎర్కారానికి చెందిన బొర్రా నరేష్(22) అబ్దుల్లాపూర్‌మెట్ PS పరిధిలోని కవాడిపల్లిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిలింనగర్‌లో నివాసముంటున్న నరేష్ ఆర్థిక, మానసిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సెప్టెంబర్ 29న సోదరుడు నవీన్‌కు ఫోన్ చేసి, దుబాయ్ వెళ్తున్నట్లు చెప్పాడు. దీంతో సెప్టెంబర్ 30న నవీన్ రాయదుర్గం PSలో ఫిర్యాదు చేయగా, ఈ రోజు SUICIDE చేసుకున్నాడు.

News October 18, 2025

APకి కొత్తగా 106 PG మెడికల్ సీట్లు: సత్యకుమార్ యాదవ్

image

AP: ప్రభుత్వ PG వైద్య విద్యలో అదనంగా 106 సీట్ల భర్తీకి NMC ఆమోదం తెలిపిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గైనిక్, పీడియాట్రిక్, ఎనస్థీషియా, రేడియాలజీ విభాగాల్లో ఈ సీట్లున్నాయి. ఇందులో 60 సీట్లు 5 కొత్త కాలేజీలకు వస్తున్నాయి. గతేడాది ప్రభుత్వం అదనపు సీట్ల మంజూరుకు ప్రతిపాదన పంపింది. దీనిపై మంత్రి సత్యకుమార్ కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో స్వయంగా మాట్లాడారు. దీంతో కొత్త మెడికల్ సీట్లు మంజూరయ్యాయి.

News October 18, 2025

అధిష్ఠానం ముందుకు.. నెల్లూరు టీడీపీ నేతల వ్యవహారం!

image

నెల్లూరులో పెద్ద దుమారం రేపిన రేషన్ మాఫియా వ్యవహారం TDP అధిష్ఠానం వద్దకు చేరుకుంది. నెల్లూరులో రేషన్ బియ్యం తరలిస్తున్న లారీలను ఇటీవల పట్టుకున్నారు. రేషన్ బియ్యం అక్రమాలపై నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి ద్వజమెత్తిన విషయం తెలిసిందే. అదే పార్టీకి చెందిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి రేషన్ మాఫియా వెనుక ఉన్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఈ క్రమంలో నుడా చైర్మన్, మరో నేత విజయవాడకు వెళ్లినట్టు సమాచారం.