News October 18, 2025
అనకాపల్లి: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర

అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో పోలీసులు శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా శ్రమదానంతో కార్యాలయం ఆవరణలో తుప్పలు తొలగించి శుభ్రం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అదనపు ఎస్పీలు దేవ ప్రసాద్, మోహనరావు మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలన్నారు. పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు.
Similar News
News October 19, 2025
కరీంనగర్లో 22న జాబ్ మేళా.!

కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగుల కోసం జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 22న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారి తిరుపతి రావు తెలిపారు. వరుణ్ మోటార్స్ సంస్థలో ఉన్న 50 పోస్టులకు ITI, ఇంటర్, డిగ్రీ అర్హతతో పాటు 20-35 ఏళ్ల వయస్సు గలవారు అర్హులని అన్నారు. వేతనం రూ.10 వేల నుంచి ప్రారంభమౌతుందని, ఆసక్తి గలవారు 22న పేరు నమోదు చేసుకోవాలన్నారు. 8143865009, 9963177056, 8886619371, 7207659969కు సంప్రదించాలన్నారు.
News October 19, 2025
గంగాధర, ధర్మపురికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మంజూరు

కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో, జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాలల స్థాపనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. కళాశాల విద్య కమిషనర్ నివేదికను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. కళాశాల ఏర్పాటుకు సంబంధించి అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని కళాశాల విద్య కమిషనర్ను ప్రభుత్వం ఆదేశించింది.
News October 19, 2025
GNT: ‘గేట్’ కమిటీ సభ్యులు మన కొత్త కోటేశ్వరరావు

కొత్త కోటేశ్వరరావు (1929, అక్టోబర్ 19-2021 నవంబర్ 29) తెనాలి సమీపంలోని సంగం జాగర్లమూడిలో జన్మించారు. 1966లో యూనివర్సిటీ ఆఫ్ అయోవా నుంచి డాక్టరల్ డిగ్రీని కూడా పొందారు. వరంగల్ ప్రాంతీయ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేశారు. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యునిగా ఆయన పనిచేశారు.