News April 8, 2024

సరైన టైమ్‌కి జోక్యం చేసుకున్నాం: మోదీ

image

సరైన సమయంలో కేంద్రం జోక్యం చేసుకోవడంతో మణిపుర్‌లో పరిస్థితి కుదుటపడిందన్నారు ప్రధాని మోదీ. ఉద్రిక్తతలను అదుపు చేసేందుకు అత్యుత్తమ వనరులు, నిర్వహణ సిబ్బందిని కేంద్రం రంగంలోకి దింపిందని తెలిపారు. పరిస్థితులను చక్కదిద్దడానికి సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా మణిపుర్ చేరుకుని 15కుపైగా సమావేశాలు నిర్వహించి పరిస్థితి పర్యవేక్షించారని పేర్కొన్నారు.

Similar News

News February 8, 2026

అరటిలో బోరాన్ లోపం లక్షణాలు – నివారణ

image

అరటిలో బోరాన్ ధాతు లోపం వల్ల ఆకుల ఈనెలు ఉబ్బెత్తుగా, బిరుసుగా, పెళుసుగా మారతాయి. ఆకుల తొడిమలు కురచబారి, మొవ్వులో గుబురుగా ఏర్పడతాయి. చెట్టు ఎదుగుదల తగ్గి, గెలలు చిన్నవిగా ఉండి, మొవ్వు నుంచి పూర్తిగా బయటకు రాదు. కాయలపై నిలువు పగుళ్లు ఏర్పడతాయి. పండు పరిమాణం, నాణ్యత కోల్పోతుంది. దీని నివారణకు లీటరు నీటికి బోరాక్స్/ బోరిక్ ఆమ్లం 1గ్రా. కలిపి ఆకులపై 10 రోజుల వ్యవధిలో 2 లేక 3 సార్లు పిచికారీ చేయాలి.

News February 8, 2026

AERAలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(A<>ERA<<>>) 3డేటా అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ( స్టాటిస్టిక్స్) అర్హతగల వారు ఫిబ్రవరి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.75,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://aera.gov.in

News February 8, 2026

అన్నదానం ఎంత పుణ్యమో..

image

అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఉడికించిన బియ్యమే కాదు, ప్రాణశక్తినిచ్చే ప్రతి ఆహారం అన్నమే. మన శరీరంలోని ‘అన్నమయ కోశం’ ఆహారం వలనే ప్రాణశక్తిని పొందుతుంది. అందుకే అన్నదానమంటే ప్రాణం దానం చేయడమే. అందుకే అన్నదానం చేయాలని శాస్త్రాలు చెబుతాయి. ఓ కోయవాడు బ్రాహ్మణుడికి ఓ రాత్రి అన్నం పెట్టిన పుణ్యంతోనే మరుజన్మలో రాకుమారుడిగా జన్మించాడు. అన్నదానానికి విచక్షణతో పనిలేదు. ఆకలితో ఉన్నవారికి పెట్టడమే పరమోత్కృష్టం.