News April 8, 2024
వివాదాస్పద పోస్ట్.. సారీ చెప్పిన మాల్దీవుల మాజీ మంత్రి
భారత్పై నోరు జారి పదవి పోగొట్టుకున్న మాల్దీవుల మాజీ మంత్రి మరియం షియూనా మరోసారి వివాదాస్పద పోస్ట్ చేశారు. ప్రతిపక్ష పార్టీని ఉద్దేశించి చేసిన పోస్ట్లో ఆ పార్టీ లోగోకు బదులు భారత జాతీయ జెండాపై ఉండే అశోక చక్రం ఉంది. దీనిపై విమర్శలు రావడంతో ఉద్దేశపూర్వకంగా తాను ఈ పోస్ట్ చేయలేదని మరియం క్షమాపణలు కోరారు. గతంలో ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెండ్ అయ్యారు.
Similar News
News October 9, 2024
PHOTO: ‘సార్ పుణ్యమా అంటూ DSCలో జాబ్ వచ్చింది’ అని దండం
TG: డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నియామకపత్రాలు అందజేశారు. ‘సార్ పుణ్యమా అంటూ డీఎస్సీలో జాబ్ వచ్చింది’ అంటూ ఓ వ్యక్తి ఎల్బీ స్టేడియంలోని సీఎం ఫ్లెక్సీకి దండం పెట్టారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
News October 9, 2024
కేంద్రం బ్యాన్ చేసిన యాప్.. ఎన్నికల సంఘం వాడుతోంది!
కేంద్రం 2020లో 59 చైనా యాప్స్ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. డాక్యుమెంట్లను కెమెరాతో స్కాన్ చేసి పీడీఎఫ్ ఫైల్స్లా సేవ్ చేసుకునేందుకు ఉపకరించే క్యామ్స్కానర్ కూడా వాటిలో ఉంది. దీన్నుంచి కూడా చైనాకు సమాచారం వెళ్తోందన్న ఆరోపణలున్నాయి. అలాంటి ఈ యాప్ను స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘమే వాడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఓ నెటిజన్ ఈ విషయాన్ని గుర్తించి పోస్ట్ పెట్టగా దానిపై చర్చ జరుగుతోంది.
News October 9, 2024
GREAT: 18 ఏళ్లకే ఎత్తైన శిఖరాలన్నీ ఎక్కేశాడు!
నేపాల్కు చెందిన నిమా రింజీ షెర్పా చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో 8వేల మీటర్లకంటే ఎత్తున్న 14 శిఖరాలనూ 18 ఏళ్లకే అధిరోహించారు. బుధవారం ఉదయం టిబెట్లోని 8027 మీటర్ల ఎత్తున్న శీష పంగ్మా పర్వత శిఖరాన్ని చేరుకోవడం ద్వారా ఈ రికార్డును అందుకున్నారు. ఈ పర్వత శిఖరాలను సమీపించేకొద్దీ మనిషికి సరిపడా ఆక్సిజన్ ఉండదు. ఈ నేపథ్యంలో ఈ 14 శిఖరాలను అధిరోహించడాన్ని పర్వతారోహకులు గొప్పగా చెబుతారు.