News October 18, 2025

DA బకాయిలు వెంటనే చెల్లించాలి: ఉద్యోగ సంఘాలు

image

AP: ఉద్యోగ సంఘాలతో మంత్రుల సబ్ కమిటీ భేటీ ముగిసింది. అపరిష్కృతంగా ఉన్న డిమాండ్లను ఉద్యోగ నేతలు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. 4 DA బకాయిలు చెల్లించాలని, కొత్త PRC, పెన్షన్ సహ అనేక సమస్యలను మంత్రుల ముందుంచారు. వీటిలో కొన్నింటిపై కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ఈ అంశాలను CM దృష్టికి తీసుకువెళ్తామని, త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

Similar News

News October 19, 2025

ప్రభుత్వ ఉద్యోగులను చంద్రబాబు దగా చేశారు: వైసీపీ నేతలు

image

AP: ప్రభుత్వ <<18045253>>ఉద్యోగులను<<>> చంద్రబాబు మరోసారి దగా చేశారని వైసీపీ మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్, మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. 4 డీఏలు పెండింగ్‌లో ఉంటే ఒకటే చెల్లిస్తామని ప్రకటించారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చి, ఇప్పుడు వారిని మోసం చేస్తున్నారని విమర్శించారు. తమపై విమర్శలు తప్ప, కూటమి ప్రభుత్వం సామాన్యులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఏమి చేయట్లేదన్నారు.

News October 19, 2025

ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. రోకోపైనే అందరి దృష్టి

image

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమ్‌ఇండియా ఇవాళ తొలి వన్డే ఆడనుంది. ODI కెప్టెన్‌గా గిల్‌కిదే తొలి మ్యాచ్ కాగా AUSను ఎలా ఎదుర్కొంటాడో అనేది ఆసక్తిగా మారింది. 7 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న రోహిత్, కోహ్లీపైనే అందరి దృష్టి నెలకొంది. కీలక ప్లేయర్లు అందుబాటులో లేకున్నా స్వదేశంలో ఆసీస్‌ను తక్కువ అంచనా వేయలేం. మ్యాచ్ 9amకు ప్రారంభమవుతుంది. జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్ చూడవచ్చు.

News October 19, 2025

మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు పెంపు

image

TG: నూతన మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తు గడువును ఎక్సైజ్ శాఖ ఈ నెల 23 వరకు పొడిగించింది. బ్యాంకులు, నిన్న బీసీ బంద్ నేపథ్యంలో దరఖాస్తు చేయలేకపోయామన్న ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ నెల 23న తీయాల్సిన డ్రాను 27కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. నిన్న ఒక్క రోజే 30వేలకు పైగా దరఖాస్తులు రాగా మొత్తంగా 80వేలు దాటినట్లు అధికారులు వెల్లడించారు.