News October 18, 2025

భద్రాద్రి: నాయనమ్మకు తలకొరివి పెట్టిన మనవరాలు

image

టేకులపల్లి మండలం బోడు గ్రామానికి చెందిన అడపా వీరమ్మ అనారోగ్యంతో శుక్రవారం మరణించారు. ఆమె భర్త మంగయ్య కొన్నేళ్ల క్రితమే మృతి చెందగా, వారికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉండగా, ఆయన నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో, శనివారం వీరమ్మ అంత్యక్రియల సందర్భంగా కుమారుడు లేకపోవడంతో, ఆయన ఎనిమిదేళ్ల కుమార్తె ప్రియతో తల్లి మల్లిక వెంట ఉండి నాయనమ్మకు తలకొరివి పెట్టించింది.

Similar News

News October 19, 2025

HYD: దీపావళి వేళ.. గుర్తుంచుకోండి ఈ నంబర్లు

image

దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాలుస్తాం.. ఒక్కోసారి అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయి. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడా ఎలాంటి ప్రమాదాలు జరిగినా అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వాలని ఆ శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ కోరారు. 24 గంటల పాటు సిబ్బంది విధి నిర్వహణలో ఉంటారని పేర్కొన్నారు. ఫైర్ యాక్సిడెంట్లకు సంబంధించి 101, 112, 9949991101 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందివ్వాలని కోరారు.

News October 19, 2025

HYD: దీపావళి వేళ.. గుర్తుంచుకోండి ఈ నంబర్లు

image

దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాలుస్తాం.. ఒక్కోసారి అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయి. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడా ఎలాంటి ప్రమాదాలు జరిగినా అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వాలని ఆ శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ కోరారు. 24 గంటల పాటు సిబ్బంది విధి నిర్వహణలో ఉంటారని పేర్కొన్నారు.  ఫైర్ యాక్సిడెంట్లకు సంబంధించి 101, 112, 9949991101 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందివ్వాలని కోరారు.

News October 19, 2025

వంటింటి చిట్కాలు

image

* కూరల్లో గ్రేవీ చిక్కబడాలంటే జీడిపప్పు పొడి, పాలు పోసి కలిపితే సరిపోతుంది.
* డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె పొంగకుండా ఉండాలంటే కాగిన నూనెలో కాస్త చింతపండు వేయాలి. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసినా నూనె పొంగదు.
* తరిగిన బంగాళదుంపలు రంగు మారకుండా ఉండాలంటే ఆ ముక్కలపై వెనిగర్ చల్లాలి.
* వంకాయ కూరలో కాస్త నిమ్మరసం చేర్చితే కూర రంగు మారదు, రుచి కూడా పెరుగుతుంది.