News October 19, 2025
సదాశివనగర్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

సదాశివనగర్ మండలం బొంపల్లి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. పోలీసులు వివరాల ప్రకారం.. గాంధారి మండలానికి చెందిన అరవింద స్వామి ద్విచక్ర వాహనంపై సదాశివనగర్ వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వాహనం ఢీ కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News October 19, 2025
జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం ప్రకటించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వర్షంతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సురక్షిత ప్రాంతాలలో రక్షణ పొందాలని సూచించారు.
News October 19, 2025
జూబ్లీ బైపోల్: ఇప్పటికి 127.. ఉన్నది ఒక్కరోజే!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్లు జోరందుకున్నాయి. అధికారులు ఊహించని విధంగా నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు 127 మంది పోటీచేస్తామంటూ ముందుకువచ్చారు. నామినేషన్లు వేసేందుకు తుది గడువు 3 రోజుల (21వ తేదీ వరకు) సమయమున్నా.. ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉంది. 19 ఆదివారం, 20న దీపావళి కావడంతో మంగళవారం ఆఖరి రోజు. ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి నామినేషన్ వేస్తామని పలువురు ప్రకటించడంతో దీనిపై ఆసక్తి నెలకొంది.
News October 19, 2025
లక్ష్మీదేవికి కమలాలు సమర్పిస్తున్నారా?

లక్ష్మీదేవి పూజలో కమలాలు సమర్పించడం అత్యంత శ్రేష్ఠమని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. దీనికి కారణం.. క్షీరసాగర మథనం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు, ఆమె చేతిలో కమలాన్ని ధరించి ఉండటం. కమలం శుద్ధి, జ్ఞానం, సంపదకు ప్రతీక. పూజలో ఈ పూలు సమర్పించడం ద్వారా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన పూజ చేసినట్లు అవుతుంది. తద్వారా ఆమె అనుగ్రహం లభించి, ఇంట ధన, ధాన్య, ఐశ్వర్యాలు స్థిరంగా ఉంటాయని విశ్వసిస్తారు.