News October 19, 2025

HYD: సౌత్ జోన్.. తెలుగు వర్శిటీ క్రికెట్ జట్ల ఎంపిక

image

సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్శిటీలో సౌత్ జోన్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు వర్శిటీ స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ ఆర్.గోపాల్ Way2Newsతో తెలిపారు. ఈనెల 22న సౌత్ జోన్ క్రికెట్, రన్నింగ్ ఎంపికలు ఉంటాయని, బాచుపల్లి, నాంపల్లి క్యాంపస్ విద్యార్థులు పాల్గొనాలని, ఈ ఎంపికలు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతాయన్నారు. వర్శిటీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News October 19, 2025

మ్యాచ్ రీస్టార్ట్.. 26 ఓవర్లకు కుదింపు

image

భారత్, ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌‌కు వర్షం అంతరాయం కారణంగా అంపైర్లు ఓవర్లను 26కు కుదించారు. వర్షం కాస్త తెరిపినివ్వడంతో మ్యాచ్ రీస్టార్ట్ అయింది. 18 ఓవర్లలో భారత్ 4 వికెట్లు కోల్పోయి 65 రన్స్ చేసింది. మరో 8 ఓవర్లు మాత్రమే మిగిలున్నాయి. అక్షర్(25*), రాహుల్ (5*) క్రీజులో ఉన్నారు. 26 ఓవర్లలో కనీసం 130 రన్స్ టార్గెట్ నిర్దేశిస్తేనే భారత్‌ పోరాడేందుకు అవకాశం ఉండనుంది.

News October 19, 2025

దూడలలో తెల్లపారుడు వ్యాధి లక్షణాలు

image

గేదె, సంకర జాతి దూడల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వ్యాధి సోకిన దూడలు తెల్లగా పారతాయి. దీని నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధికి గురైన దూడల శరీరం నుంచి నీరు కోల్పోయి కళ్లగుంటలు బాగా లోపలికి పోయి ఉంటాయి. చర్మము ముడతలు పడి ఉంటుంది. చివరకు వ్యాధి తీవ్రంగా మారితే దూడ ఎక్కువగా పారి నీరసించి చనిపోతుంది. అందుకే ఈ వ్యాధి లక్షణాలను గుర్తించిన వెంటనే వెటర్నరీ వైద్యునికి చూపించాలి.

News October 19, 2025

పల్నాడు వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా మల్లికార్జున్రెడ్డి

image

పల్నాడు జిల్లా వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి నియామకాన్ని ఆదివారం ప్రకటించారు. రొంపిచర్లకి చెందిన గెల్లి మల్లికార్జున్రెడ్డి మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. తన నియామకానికి సహకరించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలకు మల్లికార్జున్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.