News October 19, 2025
ధన్వంతరి స్వామి చేతిలో జలగ ఎందుకు?

ఆయుర్వేదంలో ‘రక్త మోక్షణం’ అనే ఓ ముఖ్యమైన చికిత్స ఉంటుంది. దీనర్థం రక్తాన్ని శుద్ధి చేయడం. ఈ చికిత్సలో భాగంగా శరీరంలోని చెడు రక్తాన్ని సురక్షితంగా బయటకు తీయడానికి జలగను వాడతారు. అవి రోగగ్రస్తమైన రక్తాన్ని మాత్రమే పీల్చి, ఆ భాగానికి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. రోగాలను నివారించే, చికిత్స చేసే వైద్య విధానాన్ని సూచించడానికి ధన్వంతరి స్వామి తన ఔషధ పాత్రతో పాటు జలగను కూడా ధరించి దర్శనమిస్తారు.
Similar News
News October 21, 2025
దీపావళి విషెస్ చెప్పి చనిపోయిన నటుడు

బాలీవుడ్ హాస్య దిగ్గజం గోవర్ధన్ అస్రానీ నిన్న కన్నుమూసిన <<18059366>>విషయం<<>> తెలిసిందే. మ.3 గంటలకు ఆయన చనిపోయినట్లు మేనేజర్ బాబు భాయ్ చెప్పారు. అయితే అంతకు గంట ముందే అస్రానీ తన ఇన్స్టాలో ‘హ్యాపీ దీపావళి’ అంటూ పోస్ట్ పెట్టారు. అంతలోనే తమ అభిమాన నటుడు మరణించారని తెలియడంతో ఫ్యాన్స్ దిగ్భ్రాంతికి గురయ్యారు. 1960ల్లో సినీ ప్రయాణం ప్రారంభించిన అస్రానీ 70ల్లో స్టార్ కమెడియన్గా ఎదిగారు. ఆయనకు భార్య మంజు ఉన్నారు.
News October 21, 2025
భగవద్గీతను ఎవరెందుకు చదవాలి?

మానవులందరికీ మార్గదర్శనం చేసే దివ్య గ్రంథం భగవద్గీత. ఉత్తమ జీవితం కోసం ప్రతి ఒక్కరూ గీతను అధ్యయనం చేయాలి. విద్యార్థులు క్రమశిక్షణ కోసం, యువకులు సరైన జీవన విధానం కోసం, వృద్ధులు మరణానంతర ఆలోచనల కోసం, అజ్ఞానులు జ్ఞానం కోసం, ధనవంతులు దయ అలవరుచుకోవడానికి, బలవంతులు దిశానిర్దేశం కోసం, కష్టాల్లో ఉన్నవారు పరిష్కారం కోసం భగవద్గీతను చదవాలి.
* రోజూ ఇలాంటి ఆసక్తికర కంటెంట్ కోసం <<-se_10013>>భక్తి<<>> క్లిక్ చేయండి.
News October 21, 2025
నేడు..

* మంగళగిరిలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొననున్న ఏపీ సీఎం చంద్రబాబు
* హైదరాబాద్లోని గోషామహల్లో అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో నివాళులు అర్పించనున్న టీజీ సీఎం రేవంత్
* జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్లకు నేడే ఆఖరు.. ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్న బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి
* ఇవాళ WWCలో తలపడనున్న దక్షిణాఫ్రికా, పాకిస్థాన్