News October 19, 2025

గంగాధర, ధర్మపురికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మంజూరు

image

కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో, జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాలల స్థాపనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. కళాశాల విద్య కమిషనర్ నివేదికను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. కళాశాల ఏర్పాటుకు సంబంధించి అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని కళాశాల విద్య కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

Similar News

News October 21, 2025

సైబర్ క్రైమ్ గ్యాంగ్ లీడర్.. కేరాఫ్ చాయ్‌వాలా

image

బిహార్‌లో అభిషేక్ కుమార్ అనే చాయ్‌వాలా అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ నెట్‌వర్క్ లీడర్‌గా తేలాడు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నో సైబర్ నేరాలకు పాల్పడిన అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అభిషేక్ ఇంట్లో సోదాలు చేపట్టి రూ.1.05 కోట్ల నగదు, 344గ్రా. గోల్డ్, 1.75KGs సిల్వర్ సీజ్ చేశారు. 85 ATM కార్డులు, 75 బ్యాంక్ పాస్‌బుక్స్, 28 చెక్‌బుక్స్, ఆధార్ కార్డ్స్, ల్యాప్‌టాప్స్, ఫోన్స్, లగ్జరీ కారు స్వాధీనం చేసుకున్నారు.

News October 21, 2025

నిజాంసాగర్ ప్రాజెక్టు.. ఒక గేటు ఎత్తివేత

image

నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ నుంచి 4,048 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. దీంతో మంగళవారం ఉదయం ప్రాజెక్టు ఒక వరద గేట్లను ఎత్తి 4,048 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1405 అడుగులు (17.802 టీఎంసీ)లతో నిండుకుండలా మారింది.

News October 21, 2025

తెరుచుకోని కేంద్రాలు.. గ్రామాల్లో దళారుల తిష్ట

image

దళారులు చేతిలో పత్తి రైతులు దగాకు గురవుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం పత్తి పంట చేతికొచ్చింది. ఇప్పటికే పత్తి మొదటి దశ పత్తి ఏరడం పూర్తయి రెండో దశ కూడా ఏరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈసారి 45 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. నేటికీ పత్తి కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు గ్రామాల్లో తిష్ట వేసి కొనుగోళ్లు చేస్తున్నారు. దీపావళి తర్వాతే సీసీఐ కేంద్రాలను ప్రారంభించనున్నారు.