News October 19, 2025

ప్రకృతి మాటున ప్రమాదం.. 14 మంది మృతి

image

ప్రకృతి అందాల మాటున పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టలేక పలువురు జల సమాధి అవుతున్న ఘటనలు కన్నీరు తెప్పిస్తున్నాయి. కైగల్, గంగనశిరస్సు, YSR జలాశయం, కళ్యాణరేవు వాటర్ ఫాల్స్ భారీ వర్షాలకు నిండు కుండలా మారాయి. పర్యాటకులు అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాలు తప్పవని పలువురు హెచ్చరిస్తున్నారు. ఏడేళ్లలో వాటర్ ఫాల్స్ ప్రమాదాలలో దాదాపు 14 మంది <<18040804>>మృతి<<>> చెందినట్లు సమాచారం.

Similar News

News October 19, 2025

KNR: దీపావళి.. ఈ నంబర్లు SAVE చేసుకోండి..!

image

కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా దీపావళి పండుగను సురక్షితంగా జరుపుకోవాలని CP గౌష్ ఆలం సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, ప్రజలు తక్షణ సాయం కోసం వెంటనే కింది నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు. పోలీస్ కంట్రోల్ రూం(PCR) 100, ఫైర్ కంట్రోల్ రూం 101, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్(ERSS) 112 నంబర్లను సంప్రదించాలన్నారు. సేవలు అందించడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారన్నారు.

News October 19, 2025

వేములవాడ రాజన్న ఆలయంలో రేపు దీపావళి వేడుకలు

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో నరక చతుర్థిని పురస్కరించుకొని రేపు (ఈనెల 20న ) ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. తెల్లవారుజామున 3.30 గంటల నుంచి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటలకు నరకాసురవధ పురాణ కాలక్షేపం, 6 గంటలకు కల్యాణ మండపంలో ధనలక్ష్మి పూజను ఆలయ అర్చకుల వేద మంత్రాలతో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

News October 19, 2025

పెద్దపల్లి జిల్లాలో ఎక్సైజ్ టెండర్లకు భారీ స్పందన

image

పెద్దపల్లి జిల్లాలో ఎక్సైజ్ టెండర్లకు భారీ స్పందన కనిపించింది. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు కేంద్రాల వద్ద శనివారం ఒక్కరోజులోనే 597 దరఖాస్తులు వచ్చినట్టు జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు పెద్దపల్లిలో 325, సుల్తానాబాద్ 249, రామగుండం 373, మంథని 242 మొత్తంగా 1189 దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడించారు.