News October 19, 2025
కామారెడ్డిలో మటన్, చికెన్ ధరల వివరాలు..!

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఆదివారం మటన్, చికెన్ ధరలు గత వారం మాదిరిగానే స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో మటన్ ధర రూ.800గా ఉంది. కిలో చికెన్ స్కిన్ లెస్ రూ.240, లైవ్ కోడి ధర కిలో రూ.160గా విక్రయిస్తున్నారు. మాంసం ధరల్లో ఎలాంటి మార్పులు లేవు.
Similar News
News October 21, 2025
191 మంది పోలీస్ అమరవీరులకు సీపీ నివాళులు

విధినిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకమని రామగుండం CP అంబర్ కిషోర్ ఝా అన్నారు. RGM CP కార్యాలయంలో అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని(ఫ్లాగ్ డే)ను ఘనంగా నిర్వహించారు. గతేడాది నుంచి ఇప్పటివరకు దేశంలో విధినిర్వహణలో మరణించిన 191 మంది పోలీస్ అమరవీరులకు CP నివాళులర్పించారు. అమరుల త్యాగాలు శాఖకు మార్గదర్శకమని, వారి కుటుంబాలకు మద్దతందిస్తామని CP అన్నారు.
News October 21, 2025
కందుకూరులో పోలీసులు అతి: YCP

కందుకూరులో పోలీసులు చాలా అతి చేస్తున్నారని YCP మండిపడింది. ‘TDPగూండాల చేతిలో దారుణ హత్యకి గురైన లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న YCP నేత అంబటి మురళిని పోలీసులు అడ్డుకున్నారు. నిందితులు టీడీపీ నేతలే కావడంతో ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయట్లేదు. అఖరికి పరామర్శకు సైతం దూరం చేస్తూ కాపులపై కక్ష సాధిస్తున్నావా చంద్రబాబు’ అని వైసీపీ ప్రశ్నించింది.
News October 21, 2025
రోహిత్, జైస్వాల్, అభిషేక్.. గిల్కి జోడీ ఎవరు?

మరో రెండేళ్ల(2027)లో మెన్స్ వన్డే CWC రానుంది. ఇప్పటి నుంచే ఆ టోర్నీలో ఓపెనింగ్ జోడీపై SMలో చర్చ మొదలైంది. T20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ వన్డేలకే పరిమితమయ్యారు. అప్పటివరకు ఆయన కొనసాగుతారా? లేదా? అనేది సందిగ్ధంగా మారింది. అయితే జైస్వాల్-గిల్ జోడీ అయితే బెటరని కొందరు, అభిషేక్-గిల్ అని మరికొందరు, రోహిత్-గిల్ బెస్ట్ అని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఏ జోడీ అయితే బెటర్? COMMENT