News October 19, 2025
నేడు ఉర్సు గుట్టపై నరకాసుర వధ..!

దీపావళి సందర్భంగా WGL ఉర్సు గుట్ట రంగలీల మైదానంలో నేడు నరకాసుర వధ ఉత్సవం జరగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలతో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మరుపల్ల రవి ఆధ్వర్యంలో 23 ఏళ్లుగా నరకాసురవధ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభించి 8 గంటలకు మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా స్విచ్ ఆన్ చేసి దహనం చేస్తారు.
Similar News
News October 21, 2025
HYDలో మహిళా శక్తికి రూ. 57 కోట్లతో నాలుగు హాస్టళ్లు!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి ప్రాజెక్ట్ మహిళల ఆశలకు ఊపిరి పోస్తోంది. రూ. 57,56,31,404 అంచనా వ్యయంతో HYDలోని ఖైరతాబాద్, షేక్పేట్, ఆసిఫ్నగర్లో 4 అత్యాధునిక వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను నిర్మించనుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో ఉద్యోగాలు చేసుకునే మహిళలకు ఇవి భరోసా కల్పించనున్నాయి. సురక్షిత, సౌకర్యవంతమైన వసతి కల్పించనున్నారు. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
News October 21, 2025
HYDలో మహిళా శక్తికి రూ. 57 కోట్లతో నాలుగు హాస్టళ్లు!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి ప్రాజెక్ట్ మహిళల ఆశలకు ఊపిరి పోస్తోంది. రూ. 57,56,31,404 అంచనా వ్యయంతో HYDలోని ఖైరతాబాద్, షేక్పేట్, ఆసిఫ్నగర్లో 4 అత్యాధునిక వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను నిర్మించనుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో ఉద్యోగాలు చేసుకునే మహిళలకు ఇవి భరోసా కల్పించనున్నాయి. సురక్షిత, సౌకర్యవంతమైన వసతి కల్పించనున్నారు. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
News October 21, 2025
ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు ఆర్డినెన్స్!

TG: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 21ను సవరించేందుకు అసెంబ్లీ ఆమోదం తప్పనిసరి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ జారీ చేయటమే ప్రత్యామ్నాయం. రెండు రోజుల్లో దానికి సంబంధించిన ఫైలును గవర్నర్కు పంపి ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.