News October 19, 2025

మహిళలను వేధిస్తున్న 44 మంది అరెస్ట్

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో షీ టీమ్ బృందాలు వివిధ ప్రాంతాల్లో మహిళలను వేధిస్తున్న 44 మంది ఆకతాయిలను అరెస్ట్ చేశాయి. 12 మంది మహిళలు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ కొనసాగుతోందని DCP సృజన కర్ణం తెలిపారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సహకారంతో ఆరుగురు ట్రాంజెండర్స్‌తోపాటు 12 మంది సెక్స్ వర్కర్లను అరెస్టు చేశారు. CP ఆదేశాల మేరకు ప్రత్యేకమైన తనిఖీలు కొనసాగుతాయని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమకు తెలపాలన్నారు.

Similar News

News October 21, 2025

విజయవాడలో ఆ స్థలం వినియోగిస్తే లక్షల మందికి మేలు!

image

గుణదలలోని ESI ఆసుపత్రి స్థలం ఆక్రమణలకు గురవుతోంది. మొత్తం 25 ఎకరాల్లో 2 ఎకరాలు ఇప్పటివరకు ఆక్రమణలకు గురైంది. మిగతా 23 ఎకరాల స్థలం ముళ్ళ కంపలు పెరిగిపోయి అడవిని తలపిస్తోంది. ESI విజయవాడ డివిజన్ పరిధి 7 జిల్లాలో 5 లక్షలకు పైగా కార్మికులు బీమా చెల్లిస్తున్నారు. వీరందరికీ వైద్యం అందించేందుకు కనీసం ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులో లేదు. ఈ 23 ఎకరాల స్థలాన్ని అందుకు వినియోగిస్తే బావుంటుంది.

News October 21, 2025

మానవపాడు: రైలు కిందపడి యువకుడి సూసైడ్

image

ఆరోగ్యం బాగోలేక జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మానవపాడులో చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ తెలిపిన వివరాలు.. మానవపాడుకు చెందిన ఆనంద్ (26) వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్. ఆరోగ్యం బాగో లేకపోవడంతో మానసికంగా బాధపడుతూ జీవితంపై విరక్తితో మానవపాడు సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి కన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News October 21, 2025

తిరుపతి జిల్లా స్థాయి యువజనోత్సవాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరిగే జాతీయ యువజనోత్సవాల్లో పాల్గొనే ఆసక్తిగల వారి నుంచి సెట్విన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జానపద నృత్యాలు, జానపద గీతాలు, జీవన నైపుణ్య విభాగం పోటీలు జరగనున్నాయి. ఈనెల 28న తిరుపతిలోని ఎమరాల్డ్స్ కాలేజీలో పోటీలు జరగనున్నాయి. ఇతర వివరాలకు 8341111687కు సంప్రదించగలరు.