News October 19, 2025

జనగామ: త్వరలో కొత్త పంచాయతీ అధికారి

image

త్వరలో జనగామ జిల్లాకు కొత్త పంచాయతీ అధికారి రానున్నారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు కొత్త డీపీవోలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల గ్రూప్- 1లో ఎంపికైన ఎ.నవీన్‌ను జనగామకు నియమించారు. ప్రస్తుతం శిక్షణలో ఉన్నందున శిక్షణ అనంతరం విధుల్లో చేరనున్నారు.

Similar News

News October 21, 2025

MHBD: ఎలక్షన్లని ఊరించారు.. తీరా ఆపేశారు..!

image

TGలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో MHBD జిల్లాలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. తీరా BCలకు 42% రిజర్వేషన్‌‌కు కోర్టు స్టే ఇవ్వడంతో ఎలక్షన్ వాయిదా పడింది. సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి 20 నెలలు కావొస్తుండగా.. ఎలక్షన్లు జరిగి సర్పంచ్‌ని ఎన్నుకుంటే గ్రామ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు అనుకున్నారు. ఎన్నికలు ఊరించి ఒక్కసారిగా నిలిచిపోవడంతో ఆశావహులు నిరాశ చెందారు. MHBD జిల్లాలో 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

News October 21, 2025

ధాన్యం కొనుగోలు పై పకడ్బందీగా శిక్షణ ఇవ్వాలి: అదనపు కలెక్టర్

image

వనపర్తి జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి ఏర్పాటు చేయబోయే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల
ఇన్‌ఛార్జ్‌లకు రెండు రోజులలో ధాన్యం కొనుగోళ్లపై పకడ్బందీగా శిక్షణ ఇవ్వాలని అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి ఏర్పాటు చేయబోయే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్‌ఛార్జ్‌‌లకు ధాన్యం కొనుగోళ్లపై పకడ్బందీగా శిక్షణ ఇవ్వాలని చెప్పారు.

News October 21, 2025

సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి: నిర్మల్ కలెక్టర్

image

తెలంగాణ రైజింగ్ – 2047 సిటిజన్ సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్ – 2047 సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. www.telangana.gov.in /telanganarising వెబ్ సైట్‌ను సందర్శించి ప్రతీ ఒక్కరు తమ అమూల్యమైన సలహాలు, సూచనలను ఇవ్వాలని కోరారు.