News October 19, 2025
పోలవరంలో అత్యధిక వర్షపాతం నమోదు

ఏలూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో భారీ స్థాయిలో వర్షపాతం నమోదైంది అధికారులు ఆదివారం తెలిపారు. అత్యధికంగా పోలవరంలో 104.6 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. అత్యల్పంగా పెదవేగిలో 4.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముదినేపల్లి 101.2, బుట్టాయిగూడెం 85.4, ఏలూరు 84.8, జంగారెడ్డిగూడెం 80.4, నిడమర్రు 80.2, కొయ్యలగూడెం 79.8, ద్వారకాతిరుమల 73.0, భీమడోలు 49.4 మి.మీ వర్షపాతం నమోదయిందన్నారు.
Similar News
News October 19, 2025
కాకినాడ: రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు

దీపావళి పర్వదినం సందర్భంగా ఈ నెల 20వ తేదీ (సోమవారం) నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం జరిగే ఈ కార్యక్రమం రద్దయిన విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. అలాగే ప్రజలందరీ ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
News October 19, 2025
తొలి మహిళా సీఎం సుచేతా కృపలాని

స్వాతంత్ర్య సమరయోధురాలు సుచేతా కృపలాని దేశంలోనే తొలి మహిళా CMగా బాధ్యతలు చేపట్టి చరిత్రలో నిలిచారు. 1908లో పంజాబ్లోని జన్మించిన ఆమె బెనారస్ యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా పనిచేశారు. 1936లో ప్రొఫెసర్ కృపలానీని మ్యారేజ్ చేసుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జైలుకెళ్లారు. స్వాతంత్య్రం తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి లోక్సభ, శాసనసభలకు ప్రాతినిధ్యం వహించారు. 1963లో UP CMగా ఎన్నికై చరిత్ర సృష్టించారు.
News October 19, 2025
దీపావళి దివ్యకాంతులు అందరికీ ఆనందాన్ని తేవాలి: కలెక్టర్

దీపావళి పండుగ సందర్భంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రజలకు కలెక్టర్ మహేశ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి దివ్య కాంతులు అందరికీ శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని తేవాలని ఆకాంక్షించారు. చీకటిపై కాంతి, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి దీపావళి సంకేతంగా నిలుస్తుందన్నారు. జీవితమంటే చీకటి వెలుగుల సమన్వయమేనని దీపావళి నేర్పే పాఠమని కలెక్టర్ పేర్కొన్నారు.