News October 19, 2025
నెల్లూరు: చేనేతలకు ఉచిత విద్యుత్ అమలు ఎప్పుడు..?

చేనేతలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ఇస్తామంటూ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం 100 యూనిట్ల వరకే ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. దీంతో చేనేతలు కరెంట్ బిల్లులు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 7 వేల చేనేత కుటుంబాలు ఉన్నాయి. చేనేత కార్మికులకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ జీవో విడుదలైంది కానీ అది ఇంతవరకు ఆచరణలోకి రాకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.
Similar News
News October 19, 2025
నెల్లూరు జనసేన వివాదంపై త్వరలో విచారణ!

నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో ఇటీవల ఏర్పడిన వివాదాలపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్గా దృష్టి సారించారు. జిల్లా ముఖ్య నేత, టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్పై కొందరు నాయకులు బహిరంగంగానే విమర్శలు చేశారు. పార్టీ సీనియర్ నాయకులను కాదని వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని అధినేత దృష్టికి తీసుకెళ్లారు. దాంతో పార్టీ రాష్ట్ర MSME ఛైర్మన్ శివశంకర్ను విచారణకు పంపనున్నారు.
News October 19, 2025
అధిష్ఠానం ముందుకు.. నెల్లూరు టీడీపీ నేతల వ్యవహారం!

నెల్లూరులో పెద్ద దుమారం రేపిన రేషన్ మాఫియా వ్యవహారం TDP అధిష్ఠానం వద్దకు చేరుకుంది. నెల్లూరులో రేషన్ బియ్యం తరలిస్తున్న లారీలను ఇటీవల పట్టుకున్నారు. రేషన్ బియ్యం అక్రమాలపై నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి ద్వజమెత్తిన విషయం తెలిసిందే. అదే పార్టీకి చెందిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి రేషన్ మాఫియా వెనుక ఉన్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఈ క్రమంలో నుడా చైర్మన్, మరో నేత విజయవాడకు వెళ్లినట్టు సమాచారం.
News October 18, 2025
అధిష్ఠానం ముందుకు.. నెల్లూరు టీడీపీ నేతల వ్యవహారం!

నెల్లూరులో పెద్ద దుమారం రేపిన రేషన్ మాఫియా వ్యవహారం TDP అధిష్ఠానం వద్దకు చేరుకుంది. నెల్లూరులో రేషన్ బియ్యం తరలిస్తున్న లారీలను ఇటీవల పట్టుకున్నారు. రేషన్ బియ్యం అక్రమాలపై నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి ద్వజమెత్తిన విషయం తెలిసిందే. అదే పార్టీకి చెందిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి రేషన్ మాఫియా వెనుక ఉన్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఈ క్రమంలో నుడా చైర్మన్, మరో నేత విజయవాడకు వెళ్లినట్టు సమాచారం.