News October 19, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రీచ్ కానీ టార్గెట్..!

ఉమ్మడి KNR జిల్లాలో 2025-27కు గాను వైన్ షాప్ టెండర్ల ద్వారా రూ.380 కోట్ల ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 287 వైన్ షాపులకు గాను 7188 దరఖాస్తుల ద్వారా రూ.215.64 కోట్ల ఆదాయం వచ్చింది. క్రితంసారి 10,734 దరఖాస్తులకు గాను 214.68 కోట్ల ఆదాయం రాగా.. ఈసారి 3,546 దరఖాస్తులు తక్కువగా వచ్చినా రూ.కోటి 4 లక్షల ఆదాయం పెరిగింది. ఈనెల 23లోపు టార్గెట్ రీచ్ అవుతోందో, కాదో వేచి చూడాలి.
Similar News
News October 19, 2025
VJA: 21న APSSDC ఆధ్వర్యంలో కంపెనీ స్పెసిఫిక్ డ్రైవ్

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో విజయవాడ MG రోడ్లోని జోయాలుక్కాస్లో ఈ నెల 21న జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళాకు ఇంటర్, డిగ్రీ చదివిన 18-25 ఏళ్లలోపు అభ్యర్థులు హాజరు కావొచ్చని జిల్లా ఉపాధి కల్పన అధికారి మధుభూషణ్ తెలిపారు. అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/user-registrationలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, కంపెనీ స్పెసిఫిక్ డ్రైవ్ ద్వారా 500 ఉద్యోగాలను కల్పిస్తామన్నారు.
News October 19, 2025
పూతలపట్టులో చోరీ

పూతలపట్టు మండలం ఈ కొత్తకోట పంచాయతీ చౌటపల్లి దళితవాడలో రంగయ్య కుమారుడు పాటూరు దాము ఇంట్లో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 60 గ్రాములు బంగారు, వెండి కాళ్లపట్టీలు మూడు జతలు, రూ.50 వేలు నగదు చోరీ చేసి తీసుకెళ్లారు. ఈ మేరకు దాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి ఇంటిని తనిఖీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 19, 2025
NZB: రియాజ్ EXCLUSSIVE PHOTO

NZBలో కానిస్టేబుల్ను హత్య చేసిన రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేసినట్లు వచ్చిన వార్తలపై సీపీ సాయి చైతన్య ఖండించారు. సారంగపూర్లో నిందితున్ని పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఆసిఫ్ అనే వ్యక్తిపై హత్య చేయడానికి ప్రయత్నించగా అక్కడ జరిగిన పెనుగులాటలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు రియాజ్ను పట్టుకుని, ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రియాజ్ EXCLUSSIVE PHOTO Way2Newsకు దొరికింది.