News October 19, 2025

రేపు అన్నమయ్య జిల్లా ‘ప్రజా ఫిర్యాదుల వేదిక’ రద్దు

image

అన్నమయ్య జిల్లా రాయచోటి ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరగాల్చిన ‘ప్రజా సమస్యల ఫిర్యాదుల వేదిక’ను రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయ పోలీసులు ‘ప్రజా ఫిర్యాదుల వేదిక’ రద్దు చేసినట్లు చెప్పారు. దీపావళి పండుగ దృష్ట్యా సోమవారం జరగాల్సిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (పబ్లిక్ గ్రీవెన్స్) కార్యక్రమాన్ని రద్దు చేశామని అన్నారు.

Similar News

News October 19, 2025

చిన్నకోడూరు: కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలి: హరీశ్ రావు

image

సిద్దిపేట జిల్లా ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదివారం చిన్నకోడూరు మండలంలో మొక్కజొన్న పంటలను పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి తిట్ల మీద ఉన్న ధ్యాస పత్తి, మొక్కజొన్న రైతుల కష్టాలపై లేదన్నారు. అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను కొనుగోళ్లు ఆలస్యం చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మరింత నష్టపరుస్తుందని విమర్శించారు.

News October 19, 2025

వేములవాడకు చేరుకున్న పీఠాధిపతి..!

image

శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతివారు వేములవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ధర్మ విజయ యాత్రలో ఆయనను వేములవాడ MLA ఆది శ్రీనివాస్ సాదరంగా ఆహ్వానించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తజనం మంగళ హారతులతో శృంగేరి పీఠాధిపతికి ఘన స్వాగతం పలికింది. ఆయన రాకతో వేములవాడలో పండగ వాతావరణం నెలకొంది. కాగా, సుదూర ప్రాంతాల నుంచి వివిధ పార్టీలకు చెందిన నేతలూ స్వామీజీకి స్వాగతం పలికేందుకు వచ్చారు.

News October 19, 2025

గద్వాల: దీపావళి జాగ్రత్తగా జరుపుకోండి: ఎస్పీ

image

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రజలందరికీ ఎస్పీ శ్రీనివాసరావు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళిని సంతోషంగా, వెలుగుల పండుగగా జరుపుకోవాలని ఆయన కోరారు. బాణసంచా కాల్చేటప్పుడు తప్పనిసరిగా భద్రతా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చిన్నారులు, యువత తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే బాణసంచా కాల్చాలని, ప్రమాదకరమైన వాటిని వాడకూడదని ఎస్పీ సూచించారు.