News October 19, 2025
PHOTOS: పార్వతీపురం ఘటనలో గాయపడ్డ వారు వీరే

పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో బాణసంచా <<18049906>>పేలిన ఘటన<<>>లో ముగ్గురు గాయపడ్డారు. బస్సు నుంచి క్రాకర్స్ పార్శిల్ బాక్స్ దింపుతుండగా పేలుడు సంభవించినట్లు సమాచారం. క్షతగాత్రులను పై ఫొటోలలో చూడొచ్చు. వారి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వారు పార్వతీపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Similar News
News October 19, 2025
విజయవాడ: పర్యాటకులకు గుడ్ న్యూస్

విజయవాడ భవాని ఐలాండ్లో ఆదివారం నుంచి బోటు షికారు తిరిగి ప్రారంభమైంది. గత 60 రోజులుగా ఎగువ నుంచి కురుస్తున్న వర్షాల ఉధృతి, వర్షాల కారణంగా కృష్ణా నదిలో బోటు షికారు నిలిచిపోయింది. ఆదివారం బోటింగ్ తిరిగి ప్రారంభం కావడంతో టూరిస్టులు బోటు షికారుకు ఆసక్తి చూపారు. కాగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ నిర్వహణ జరుగుతోంది.
News October 19, 2025
పెనుగొండ: గోదావరిలో మహిళ మృతదేహం

పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద గోదావరి నదిలో ఓ మహిళ మృతదేహం కొట్టుకువచ్చింది. పెనుగొండ ఎస్ఐ కె. గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 40 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న మహిళ మృతదేహాన్ని నదిలో గుర్తించారు. సిద్ధాంతం వీఆర్వో నాగేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 19, 2025
నిర్మల్: టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

చెడుపై మంచి విజయం సాధించిన ప్రతీకగా దీపావళిని జరుపుకుంటామని, ప్రతి ఇంటిలో ఆనందం, వెలుగు నిండాలని ఆకాంక్షించారు. దీపావళి పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రజలకు, అధికారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, సమృద్ధి కలగాలని కోరుకుంటూ, టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు.