News October 19, 2025
సూర్యాపేట: చెరువులో పడి యువకుడి మృతి

మోతె మండలం మామిళ్లగూడెంలో ఓ యువకుడు చెరువులో జారిపడి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జూలకంటి సురేందర్ రెడ్డి (34) శనివారం రాత్రి చెరువు వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తూ అందులో పడి చనిపోయాడు. సురేందర్ రెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Similar News
News October 19, 2025
ఘనంగా పైడిమాంబ కలశ జ్యోతి ఊరేగింపు

ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి కలశ జ్యోతి ఊరేగింపు కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఆలయ అధికారుల ఆధ్వర్యంలో, వేద పండితులు పైడిమాంబ దీక్ష దారులు పెద్ద సంఖ్యలో ఆదివారం సాయంత్రం పైడితల్లి అమ్మవారి వనంగుడి నుండి చదురగుడి వరకు కలశ జ్యోతి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
News October 19, 2025
గజ్వేల్: పీహెచ్సీ తనిఖీ చేసిన కలెక్టర్.. సీరియస్

గజ్వేల్ మండలం అహ్మదీపూర్ పీహెచ్సీని జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించిన కలెక్టర్, సంతకాల్లో తేడాలు గుర్తించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి రాకుండానే సంతకాలు చేసినట్లు గుర్తించి, సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీఎంహెచ్ఓను ఆదేశించారు.
News October 19, 2025
భువనగిరి: ఎక్స్పైరీ ఇంజెక్షన్ ఇచ్చిన ఇద్దరు సస్పెండ్

తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గడువు ముగిసిన ఇంజెక్షన్ ఇచ్చిన ఘటనపై కలెక్టర్ హనుమంతరావు కఠిన చర్యలు తీసుకున్నారు. విచారణలో నిర్లక్ష్యం రుజువు కావడంతో NHM రజిత, ఫార్మసీ ఆఫీసర్ మహేశ్వరిని తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.