News October 19, 2025

భద్రాద్రి: ‘కగార్’ దెబ్బ.. కీకారణ్యం వీడి జనారణ్యంలోకి!

image

50 ఏళ్లుగా కొనసాగిన నక్సల్బరీ ఉద్యమం చర్ల సరిహద్దుల్లోని కర్రె గుట్టల్లో మొదలైన ఆపరేషన్ కగార్ దెబ్బకు క్షీణించింది. మావోయిస్టులు కీకారణ్యం వీడి జనారణ్యంలోకి కదులుతున్నారు. పెత్తందారులకు వ్యతిరేకంగా సాగిన ఈ పోరాటంలో ఎంతో మంది అసువులు బాసారు. మల్లోజుల, ఆశన్నల వంటి మావోయిస్టు అగ్ర నేతలు లొంగిపోవడంతో ఉద్యమం మరింత బలహీనపడింది. కొద్ది నెలలుగా SP రోహిత్ రాజు ఎదుట కూడా గుంపులు గుంపులుగా వచ్చి లొంగిపోయారు.

Similar News

News October 20, 2025

జూబ్లీహిల్స్‌లోనే కాంగ్రెస్ పార్టీకి మొదటి దెబ్బ: కేటీఆర్

image

TG: కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో BRS మొదటి దెబ్బ కొట్టబోతుందని తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ నేత కేటీఆర్ అన్నారు. రెండో దెబ్బ రాజేంద్రనగర్ లేదా ఖైరతాబాద్‌లో కొడుతామన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని విమర్శలు చేశారు. ఫిరాయింపు స్థానాల్లో ఉపఎన్నికలు ఖాయమని స్పష్టం చేశారు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికకు రావాలని సవాల్ విసిరారు.

News October 20, 2025

రాష్ట్ర షూటింగ్ బాల్ టీమ్‌కు గద్వాల బిడ్డ కెప్టెన్

image

గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం జడ్పీహెచ్ఎస్ నందిన్నెలో చదువుతున్న మహేశ్వరి తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ టీమ్‌కు కెప్టెన్‌గా ఎంపికైంది. దీంతో ఆమెను ప్రధానోపాధ్యాయుడు విజయభాస్కర్, పీఈటీ అమ్రేష్ బాబు, తల్లిదండ్రులు అభినందించారు. మహేశ్వరి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మండల ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.

News October 20, 2025

KMR: RTA చెక్‌పోస్ట్‌లపై ACB మెరుపు దాడి (UPDATE)

image

అవినీతి పాల్పడుతున్న అధికారుల గుండెల్లో ACB రైళ్లను పరిగెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో మద్నూర్ మండలం సలాబత్పూర్ RTA చెక్‌పోస్ట్‌పై దాడి జరిపిన ACB అధికారులు రూ.36 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా, బిక్కనూర్ పొందుర్తి చెక్‌పోస్ట్ వద్ద దాడులు నిర్వహించి రూ.51,300 స్వాధీనం పరుచుకున్నారు. మూడు నెలల వ్యవధిలోనే ఈ ఆర్టీఏ చెక్‌పోస్ట్‌లపై ఏసీబీ దాడి జరగడం గమనార్హం.