News October 19, 2025
నంద్యాల సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి దుర్మరణం

నంద్యాల సమీపంలోని చిన్నచెరువు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఆదివారం రాత్రి ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. మహానంది మండలం బొల్లవరం గ్రామానికి చెందిన హుసేన్ బాష మృతిచెందగా, బుక్కాపురం గ్రామానికి చెందిన మల్లేశ్, సువర్ణమ్మ తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 20, 2025
దీపావళి రోజన పిల్లిని పూజించే ఆచారం..

దీపావళిని మనం అజ్ఞానాన్ని తొలగించే దివ్య దీపాల పండుగ్గా జరుపుకొంటాం. కానీ అపశకునంగా భావించే పిల్లిని లక్ష్మీదేవిగా కొలిచి పూజించే సంప్రదాయం రాజస్థాన్లో ఉంది. దీపావళి పర్వదినాన అక్కడి మహిళలు మార్జాలానికి నైవేద్యం సమర్పిస్తారు. కర్ణాటకలోనూ ఈ ఆచారం ఉంది. ఆ రోజు తమ నగలను స్త్రీలు నదిలో శుభ్రం చేసి, అన్ని రకాల పిండి వంటలు వండి, పిల్లికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఫలితంగా మంచి జరుగుతుందని నమ్ముతారు.
News October 20, 2025
ADB: గుస్సాడీ వేషధారణలో అదరగొట్టిన బాలుడు

భీంపూర్ మండలంలోని వాడేగామ గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు కాత్లే ఉమేష్ ఆదివాసీల గుస్సాడీ వేషధారణలో అదరగొట్టాడు. ఎంత ఆధునికత వచ్చినా, సంస్కృతిని కాపాడుకోవడంలో ఆదివాసీలు ముందున్నారని, ఈ బాలుడి రూపంలో వారసత్వం తరాలుగా ప్రవహిస్తోందని స్థానికులు కొనియాడారు. ఈ గుస్సాడీ వేషధారణ అందరినీ ఆకట్టుకుంది.
News October 20, 2025
నిర్మల్: జిల్లాలో మద్యం దుకాణాలకు 942 దరఖాస్తులు

జిల్లాలో 47 నూతన మద్యం దుకాణాలకు సంబంధించి మొత్తం 942 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి రజాక్ తెలిపారు. మద్యం దుకాణాల దరఖాస్తు గడు ఈనెల 23వ తేదీ వరకు పొడగించినట్లు చెప్పారు. ఆసక్తి కలిగిన వారు మధ్య దుకాణాలకు జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవచ్చని అన్నారు. ఈనెల 27న దుకాణాల టెండర్లను డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేస్తున్నట్టు చెప్పారు.