News October 20, 2025
తొగుట: కస్తూర్బా పాఠశాల.. కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

తొగుటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. రాత్రివేళల్లో విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతను ఆమె పరిశీలించారు. వంటగదికి వెళ్లి మెనూ ప్రకారం బీరకాయ కూర, సాంబారు పెడుతున్నారా అని ఆరా తీశారు. అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేస్తూ, రాత్రి విధులు నిర్వహించే అధ్యాపకులు సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించాలని ఆదేశించారు.
Similar News
News October 20, 2025
త్వరలో వారికి ప్రత్యేక పింఛన్లు: మంత్రి కందుల

AP: రాష్ట్రంలోకి కళాకారులందరికీ త్వరలోనే ప్రత్యేక పింఛన్లను తిరిగి అందిస్తామని మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు. గత ప్రభుత్వం కళాకారుల పింఛన్లను సాధారణ పింఛన్లకు జత చేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని దుయ్యబట్టారు. త్వరలోనే నంది నాటకోత్సవాలు నిర్వహించి ఉగాది, కళారత్న పురస్కారాలు అందజేస్తామని తెలిపారు. కళాకారుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని ఓ ప్రారంభ కార్యక్రమంలో చెప్పారు.
News October 20, 2025
దీపావళి రోజున దివ్వెలు ఎందుకు వెలిగించాలి?

దీపం సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం. సకల దేవతల నివాసం. దీపం వెలిగించిన చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అందుకే దీపం లేని ఇల్లు కళావిహీనమవుతుంది. దీపారాధన లేకుండా దీపావళి చేయరు. దీపపు కుందిలో బ్రహ్మ, విష్ణుమూర్తి ఉంటారు. ఈ వెలుగుల పండుగ రోజున వారే స్వయంగా ఇంట్లో వెలుగు నింపుతారు. దీపం సమస్త దేవతా స్వరూపం కాబట్టే వారిని ఆహ్వానించి, అనుగ్రహం పొందడానికి దీపావళి నాడు దీపాలు వెలిగించాలి.
News October 20, 2025
ప్రమాదాలు జరిగితే ఈ నంబర్లకు కాల్ చేయండి: SP

మతాబులు కాల్చేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ దామోదర్ ఆదివారం సూచించారు. చిన్నపిల్లలు పెద్దల పర్యవేక్షణలో మాత్రమే మతాబులు కాల్చాలని, పాత లేదా తడిసిన మతాబులు వినియోగించరాదని చెప్పారు. కాటన్ దుస్తులు ధరించాలనీ, నైలాన్ లేదా సింథటిక్ దుస్తులు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే 101, 100, 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.