News October 20, 2025
కోరుట్ల నుంచి మహోర్కు SPL. TOUR

కోరుట్ల డిపో నుంచి ఈనెల 26న మహోర్కు వన్డే ప్రత్యేక టూర్ ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ తెలిపారు. ఉదయం 4గం.లకు మహోర్(MH)కు బస్సు బయలుదేరి అదేరోజు రాత్రి తిరిగి కోరుట్లకు చేరుకుంటుందన్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్ అందిస్తామని, ఒక్కరికి రూ.1,250లను ఛార్జిగా నిర్ణయించామన్నారు. రేణుక మాత(ఎల్లమ్మ, పరశురాము), దత్తాత్రేయ పీఠం, ఏకవీర శక్తిపీఠం, ఉంకేశ్వర్ శివాలయాల దర్శనాలు ఉంటాయి.
Similar News
News October 20, 2025
HYDలో రాత్రి 8- 10 మధ్యనే క్రాకర్లు కాల్చాలి

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాత్రి 8- 10 గంటల మధ్యే క్రాకర్లు కాల్చాలని నగర పోలీసులు చెబుతున్నారు. చిన్న పిల్లలు పటాకులు కాల్చేటప్పుడు పెద్దలు దగ్గర ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కాల్చాలని చెప్పారు. ఇసుక, నీళ్లు దగ్గర ఉంచుకోవాలన్నారు. పబ్లిక్ రోడ్లపై క్రాకర్లు కాల్చకూడదని హెచ్చరించారు. దీపావళి వేడుకల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తిరుమలగిరి ఇన్స్పెక్టర్ నాగరాజు సూచించారు.
News October 20, 2025
కృష్ణా: ఈ ఆలయం నరకాసురుడి సంహారానికి ప్రతీక..!

చల్లపల్లి మండలం నడకుదురులోని కృష్ణానది తీరాన ఉన్న పృథ్వీశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది. శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై ఇక్కడే నరకాసురుడిని సంహరించారని ఇతిహాసం. అందుకే ఈ ప్రాంతం ‘నరకొత్తూరు’ నుంచి ‘నడకుదురు’గా మారింది. ఇక్కడి పాటలీ వృక్షం అరుదైనది. దీపావళికి నరకాసురుడి దిష్టిబొమ్మ దహనం చేస్తారు. కార్తికంలో భక్తులు నది స్నానమాచరించి మొక్కులు తీర్చుకుంటారు.
News October 20, 2025
సంగారెడ్డి: ‘దీపావళి.. 101కు కాల్ చేయండి’

దీపావళి సందర్భంగా టపాకాయలు కాల్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం తెలిపారు. అగ్ని ప్రమాదాలు, గాయాలు సంభవిస్తే వెంటనే సమీప అగ్నిమాపక కేంద్రానికి లేదా 101కు సంప్రదించాలని సూచించారు. చిన్నపిల్లలు టపాకాయలు కాల్చేటప్పుడు పెద్దలు దగ్గర ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని, పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు.