News October 20, 2025
అక్టోబర్ 20: చరిత్రలో ఈరోజు

1937: హాస్యనటుడు రాజబాబు జననం(ఫొటోలో)
1962: భారత్-చైనా యుద్ధం మొదలు
1978: భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ జననం(ఫొటోలో)
1990: ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోన ప్రభాకర్ రావు మరణం
2008: దర్శకుడు సి.వి. శ్రీధర్ మరణం
2011: నటుడు, గాయకుడు అమరపు సత్యనారాయణ మరణం
➢ప్రపంచ గణాంక దినోత్సవం
Similar News
News October 20, 2025
24 నుంచి బిహార్లో మోదీ ఎన్నికల ప్రచారం

ప్రధాని మోదీ ఈ నెల 24 నుంచి బిహార్లో ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు ఆ రాష్ట్ర BJP వర్గాలు తెలిపాయి. 24న సమస్తీపూర్, బెగుసరాయ్లో జరిగే రెండు ర్యాలీల్లో ఆయన పాల్గొంటారని చెప్పాయి. తిరిగి 30న రెండు సభలకు హాజరవుతారని పేర్కొన్నాయి. నవంబర్ 2, 3, 6, 7వ తేదీల్లోనూ మోదీ ర్యాలీలు ఉంటాయని వివరించాయి. బిహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11వ తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.
News October 20, 2025
పౌరాణిక కథల సమాహారం ‘దీపావళి’

దీపావళి జరపడానికి 3 పౌరాణిక కథలు ఆధారం. నరక చతుర్దశి నాడే కృష్ణుడు, సత్యభామ కలిసి నరకాసురుడిని సంహరించారు. అధర్మంపై ధర్మ విజయాన్ని స్థాపించారు. దీనికి గుర్తుగా దీపాలు వెలిగించారు. 14 ఏళ్ల వనవాసం తర్వాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు కూడా ఇదే. ఆనాడు అయోధ్య ప్రజలు దీపాలు పెట్టి వారికి స్వాగతం పలికారు. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఉద్భవించింది కూడా ఈ తిథి నాడే. అందుకే లక్ష్మీదేవిని పూజిస్తారు.
News October 20, 2025
ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్లకు ప్రభుత్వం ఉత్తర్వులు

AP: ఆర్టీసీలో నాలుగు క్యాడర్ల ఉద్యోగుల పదోన్నతులకు అవకాశమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశంలో చంద్రబాబు హామీ ఇవ్వగా నిన్న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పనిష్మెంట్లు, పెనాల్టీలు, క్రమశిక్షణ చర్యలు వంటివి ఉన్నా వాటితో సంబంధం లేకుండా ప్రమోషన్లకు అర్హులుగా పేర్కొంది. దీంతో డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టిజన్స్ క్యాడర్లోని ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.