News October 20, 2025
KMR: RTA చెక్పోస్ట్లపై ACB మెరుపు దాడి (UPDATE)

అవినీతి పాల్పడుతున్న అధికారుల గుండెల్లో ACB రైళ్లను పరిగెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో మద్నూర్ మండలం సలాబత్పూర్ RTA చెక్పోస్ట్పై దాడి జరిపిన ACB అధికారులు రూ.36 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా, బిక్కనూర్ పొందుర్తి చెక్పోస్ట్ వద్ద దాడులు నిర్వహించి రూ.51,300 స్వాధీనం పరుచుకున్నారు. మూడు నెలల వ్యవధిలోనే ఈ ఆర్టీఏ చెక్పోస్ట్లపై ఏసీబీ దాడి జరగడం గమనార్హం.
Similar News
News October 20, 2025
ఆనందపురంలో పండగ పూట విషాదం

పెందుర్తి నుంచి ఆనందపురం వైపు వెళ్తున్న బైక్ను సోమవారం ఉదయం వేగంగా వస్తున్న వ్యాన్ మామిడిలోవ వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని భాధితులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 20, 2025
శ్రీకాకుళం జిల్లాలోని ఫైర్ ఆఫీస్ నంబర్లు ఇవే..!

➤శ్రీకాకుళం: 08942 222099
➤నరసన్నపేట: 08942 276777
➤పలాస: 08945 241101
➤రణస్థలం: 08942 234499
➤టెక్కలి: 08945 244277
➤కోటబొమ్మాళి: 08942 238659
➤ఇచ్ఛాపురం: 08647 231101
➤ఆమదాలవలస: 08942 286401
➤పొందూరు: 08941 242101
➤కొత్తూరు: 08946 258444
➤ మందస: 08947 237101 ➤సోంపేట: 08947 234101
News October 20, 2025
నల్గొండ: పత్తి కూలీల ఆటో, ట్రాక్టర్ ఢీ

ముప్పారంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని శోకంలో ముంచింది. పత్తికూలీల ఆటోను ట్రాక్టర్ బలంగా ఢీకొనడంతో ఆలంపల్లి సాయిలు అనే కూలీ ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో 8 మంది కూలీలు గాయపడ్డారు. వీరిలో ఒకరికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను 108లో మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు.