News October 20, 2025

పార్వతీపురంలో నేడు జరగాల్సిన పీజీఆర్ఎస్ రద్దు: ఎస్పీ

image

పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నేడు జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేస్తున్నట్లు ఎస్పీ మాధవ్ రెడ్డి తెలిపారు. దీపావళి పర్వదినం సందర్భంగా తాత్కాలింగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. వచ్చే వారం నుంచి యథావిధిగా వినతులు స్వీకరిస్తామన్నారు. జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి వేడుకలు జరుపుకోవాలని జిల్లా ప్రజలకు సూచించారు.

Similar News

News October 20, 2025

తాజా సినీ ముచ్చట్లు!

image

* మెగాస్టార్ చిరంజీవి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. సైకిల్‌ తొక్కుతూ వింటేజ్ లుక్‌లో కనిపించారు.
*ధనుష్‌ నటించిన ‘సార్’ సినిమా కోసం తాను మొదట రవితేజను సంప్రదించినట్లు డైరెక్టర్ వెంకీ అట్లూరి తెలిపారు. బిజీ షెడ్యూల్ వల్ల కుదరలేదని వెల్లడించారు.
* శర్వానంద్ హీరోగా అభిలాష్‌ రెడ్డి తెరకెక్కిస్తోన్న సినిమాకు ‘బైకర్’ టైటిల్‌ ఖరారు.

News October 20, 2025

జగిత్యాల: జిల్లా ప్రజలకు SP DIWALI WISHES

image

జగిత్యాల జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి ఎస్పీ అశోక్ కుమార్ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి ఆనందం, వెలుగుల పండుగగా సంతోషంగా జరుపుకోవాలని, బాణాసంచా కాల్చేటప్పుడు తప్పనిసరిగా భద్రతా నియమాలు పాటించాలని SP సూచించారు. చిన్నారులు తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పటాకులు కాల్చాలని, ప్రమాదకరమైన బాణాసంచా వాడకూడదని కోరారు. ప్రజల భద్రత కోసం పోలీసులు ప్రత్యేకంగా విధులు నిర్వర్తించనున్నట్లు తెలిపారు.

News October 20, 2025

HYD: బాలుడి చేతిలో బ్యాగ్.. అందులో బుల్లెట్

image

ప్రగతినగర్‌లో తల్లితో ఉంటున్న ఓ బాలుడు (12)ఇంట్లో ఉండటం ఇష్టం లేక మూసాపేట మెట్రో స్టేషన్‌కు బ్యాగుతో వచ్చాడు. సిబ్బంది తనిఖీ చేయగా షాక్‌కు గురయ్యారు. అందులో 9MM బుల్లెట్ బయటపడటంతో మెట్రో స్టేషన్ ఇన్‌ఛార్జికి చెప్పారు. కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. గతంలో బాలుడి తాత మిలిటరీలో పనిచేసి బుల్లెట్ ఇంట్లో ఉంచగా తెచ్చుకున్నాడని తేలింది. కేసు నమోదు చేసినట్లు SI గిరీష్ తెలిపారు.