News October 20, 2025

దీపావళి.. వైద్యులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

image

దీపావళి పండుగ సందర్భంగా వైద్యులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. కంటి గాయాలు, కాలిన గాయాలతో ఎవరైనా ఆసుపత్రికి వస్తే వెంటనే చికిత్స అందించాలని చెప్పారు. ఆసుపత్రిలో అవసరమైన మెడిసిన్ ఎక్కువ మెంట్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. బాణాసంచా కాల్చే సమయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

Similar News

News October 20, 2025

బత్తాయిలో తొడిమ కుళ్లు తెగులును ఎలా నివారించాలి?

image

తొడిమ కుళ్లు సోకి, రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. తెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా కార్బండిజం 1 గ్రాము కలిపి పిచికారీ చేయాలి. ప్రతి సంవత్సరం తొలకరిలో చెట్లలో ఎండుపుల్లలను కత్తిరించి నాశనం చేయాలి. శిలీంధ్రానికి ఆశ్రయమిచ్చే కలుపు మొక్కలను సమర్థవంతంగా అరికట్టేందుకు చెట్ల పాదుల్లో మల్చింగ్ పద్ధతిని అవలంబించాలి. తోటల్లో నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

News October 20, 2025

పొన్నూరు: ఫొటో కోసం చీరలో రూ.1లక్ష పెట్టమన్నాడు.. చివరకు

image

పొన్నూరులో సినిమాను తలపించేలా ఘరానా మోసం జరిగింది. విద్యానిగర్‌లోని రాధాకృష్ణమూర్తి ఇంట్లో చొరబడిన దొంగ, బహుమతులు వచ్చాయని నమ్మించి, ఫొటో తీయడానికి లక్ష రూపాయల నగదును చీరలో పెట్టి ఉంచాలని చెప్పాడు. ఆ తర్వాత ఆ లక్ష తీసుకొని ఉడాయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ వీరా నాయక్ తెలిపారు.

News October 20, 2025

రాజంపేట: విద్యార్థులను రక్షించిన పోలీసులు

image

అన్నమయ్య డ్యామ్ వద్ద నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఐదుగురు బీటెక్ విద్యార్థులను రాజంపేట రూరల్ పోలీసులు ప్రాణాలకు తెగించి రక్షించారు. ఆదివారం రాత్రిపూట చీకటి, నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో రాత్రంతా ఘటనా స్థలంలో పహారా ఏర్పాటు చేసి, విద్యార్థులకు ధైర్యం చెప్పి, పరిస్థితిని అదుపులో ఉంచారు. సోమవారం ఉదయం నీటి ప్రవాహం కొంత తగ్గిన వెంటనే, వారిని రక్షించారు.