News October 20, 2025
బల్కంపేట ఎల్లమ్మ గుడిలో దీపావళి పూజలు

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు, అందమైన పూలతో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపావళి ప్రత్యేక హారతి, ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. దీప కాంతులతో ఆలయం రూపుదిద్దుకుంది. ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
Similar News
News October 20, 2025
HYD: రేపు దీపక్రెడ్డి నామిషన్ ర్యాలీకీ ప్రముఖులు

జూబ్లీహిల్స్ బైపోల్లో బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్రెడ్డి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. యూసఫ్గూడ హైలంకాలనీ నుంచి షేక్పేట్ తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఇప్పటికే గోవా సీఎం ప్రమోద్ హాజరుకానున్నట్టు ధ్రువీకరించగా, అస్సాం, మహారాష్ట్ర సీఎంల కన్ఫర్మేషన్ కోసం టీబీజేపీ వెయిటింగ్.
News October 20, 2025
నగరంలో దీపావళిపై ఆర్టిఫిషియల్ వెలుగులు

దీపావళికి మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించే ఆచారం ఇప్పుడు నగరంలో తగ్గుముఖం పడుతోంది. కోఠి, అబిడ్స్, దిల్సుఖ్నగర్, బాలానగర్, కూకట్పల్లి, బేగంబజార్లో విక్రయిస్తున్న ఆర్టిఫిషియల్ లైట్లే ఆకర్షిస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. ఆన్లైన్లో లభించే వివిధ ఆకృతుల దీపాలతో ఇళ్లు అలంకరిస్తున్నారు. మట్టి ప్రమిద అజ్ఞానం తొలగించి జ్ఞాన వెలుగు ప్రసరింపజేయాలనే భావనతో వచ్చిన సంప్రదాయంగా పెద్దలు చెబుతున్నారు.
News October 20, 2025
HYD: బాలుడి చేతిలో బ్యాగ్.. అందులో బుల్లెట్

ప్రగతినగర్లో తల్లితో ఉంటున్న ఓ బాలుడు (12)ఇంట్లో ఉండటం ఇష్టం లేక మూసాపేట మెట్రో స్టేషన్కు బ్యాగుతో వచ్చాడు. సిబ్బంది తనిఖీ చేయగా షాక్కు గురయ్యారు. అందులో 9MM బుల్లెట్ బయటపడటంతో మెట్రో స్టేషన్ ఇన్ఛార్జికి చెప్పారు. కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. గతంలో బాలుడి తాత మిలిటరీలో పనిచేసి బుల్లెట్ ఇంట్లో ఉంచగా తెచ్చుకున్నాడని తేలింది. కేసు నమోదు చేసినట్లు SI గిరీష్ తెలిపారు.