News October 20, 2025

బాపట్ల: సిద్ధమవుతున్న ఆలయాలు

image

దీపావళి తర్వాత కార్తీకమాసం ప్రారంభం కానుంది. చాలామంది శైవక్షేత్రాలను దర్శించి దీపారాధన చేస్తుంటారు. ఇందులో భాగంగా బాపట్ల జిల్లాలోని శైవ క్షేత్రాలు సిద్ధమయ్యాయి. మల్లికార్జున స్వామి వారి దేవాలయం (మణికేశ్వరం), నగరేశ్వర స్వామి దేవాలయం (అద్దంకి), భవన నారాయణస్వామి దేవాలయం (బాపట్ల), జిల్లాలోని అన్ని శివాలయాల ఆలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News October 20, 2025

దీపావళి శుభాకాంక్షలు చెప్పిన పాక్ PM.. నెటిజన్ల ఫైర్

image

ప్రపంచంలోని హిందువులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పాక్ PM షరీఫ్ ట్వీట్ చేశారు. ఈ పండుగ చీకటిని పారదోలి, సామరస్యాన్ని పెంపొందించి, శాంతి, కరుణ, శ్రేయస్సు వైపు మనల్ని నడిపించాలని పేర్కొన్నారు. కాగా పహల్గాంలో హిందువులను చంపి ఇప్పుడు విషెస్ చెబుతారా అంటూ భారత నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పాక్‌లో హిందువులు, సిక్కులను ఒక పద్ధతి ప్రకారం చంపారని మండిపడుతున్నారు.

News October 20, 2025

ఏలూరు: రైలు ప్రమాదంలో ఒకరు మృతి

image

ఏలూరులో సోమవారం జరిగిన రైలు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వట్లూరు సమీపంలోని రైలు పట్టాలపై గుర్తుతెలియని మృతిదేహం పడి ఉండడంతో స్థానికులు జీఆర్పీలకు సమచారమిచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టానికి ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. రైల్వే HC శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 20, 2025

మీకు తెలుసా? దేవతల పుత్రుడే ‘నరకాసురుడు’

image

కృష్ణుడు, సత్యభామ కలిసి నరకాసురుడ్ని చంపి, వెలుగు నింపినందుకు గుర్తుగా మనం దీపావళి జరుపుకుంటాం. అయితే ఆ నరకాసురుడు దేవతల పుత్రుడే అని మీకు తెలుసా? విష్ణుమూర్తి వరాహ అవతారానికి, భూదేవికి జన్మించిన కుమారుడే ఈ అసురుడు. ప్రాగ్జ్యోతిషపురాన్ని పాలించిన ఇతను దుష్ట స్వభావాన్ని పెంచుకుని అసురుడిగా మారాడు. అహంకారం పెరిగి 16K రాజకుమార్తెలను బంధించాడు. తన తల్లి చేతిలో తప్ప మరెవరి చేత మరణం లేని వరం ఉండేది.