News October 20, 2025

BREAKING: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్

image

AP: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళి వేళ గుడ్ న్యూస్ చెప్పింది. ఒక డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన 3.64% డీఏ 2024 జనవరి 1 నుంచి వర్తించనుంది. ఇటీవల సీఎం చంద్రబాబు ఉద్యోగులతో సమావేశమై ఆర్థిక కారణాల వల్ల ముందుగా ఓ డీఏ నిధులు విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

Similar News

News October 20, 2025

అరటిలో మాంగనీసు ధాతు లోపం – నివారణ

image

అరటి తోటలో మాంగనీసు ధాతులోపం వల్ల ముదురు ఆకులపై నిర్ణీత ఆకారం లేని పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత పసుపు రంగు మచ్చ మధ్యలో ఎండిపోతుంది. మాంగనీసు ధాతులోపం తీవ్రమైతే ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. పిలకల లేత ఆకులు, ఆకుమచ్చ చారలతో తెల్లగా మారి లోపం తీవ్రమైనప్పుడు ఎండిపోతాయి. లోప నివారణకు లీటరు నీటికి మాంగనీస్ సల్ఫేట్ 2 గ్రాములు కలిపి ఆకులన్నీ తడిచేలా 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి.

News October 20, 2025

బిహార్ తొలి విడత ఎన్నికలకు ముందు పీఎం కిసాన్ నిధులు విడుదల?

image

దీపావళి సందర్భంగా కేంద్రం PM కిసాన్ 21వ విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని వార్తలు వచ్చినా మోదీ సర్కార్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే నవంబర్ మొదటి వారంలో దేశవ్యాప్తంగా రైతులకు రూ.2వేల చొప్పున జమ చేసే అవకాశం ఉందని నేషనల్ మీడియా పేర్కొంది. బిహార్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలకు (నవంబర్ 6) ముందు కేంద్రం దీనిపై ప్రకటన చేయవచ్చని తెలిపింది. ఈ-కేవైసీ పూర్తి కాని రైతులకు డబ్బులు జమ కావని వివరించింది.

News October 20, 2025

ఆత్మగౌరవమే కిరీటం! నీ లక్ష్యం కోసం కష్టపడు..

image

మిత్రమా.. ఆత్మగౌరవమే నీకు అసలైన కిరీటం. నిన్ను పట్టించుకోని వారి కోసం అస్సలు వెతకకుండా నిన్ను నువ్వు గౌరవించుకో. అవమానం జరిగితే నిశ్శబ్దంగా ఉండకుండా వెంటనే ధైర్యంగా సమాధానం చెప్పేసేయ్. నీకు సంతోషాన్ని ఇచ్చే పనులనే చెయ్యి. ఇతరుల గురించి మాట్లాడి సమయాన్ని వృథా చేయకుండా, నీ లక్ష్యాల కోసం కష్టపడు. నీ సమయం ఎంతో విలువైనదిగా భావించు. ఎప్పుడూ బిజీగా ఉండి నీ విలువను పెంచుకో! Share it