News October 20, 2025

సదర్ ఉత్సవాల్లో కిషన్‌రెడ్డి సందడి

image

TG: HYD కాచిగూడలోని చప్పల్ బజార్‌లో యాదవుల సదర్ ఉత్సవాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సందడి చేశారు. ‘ఆల్ ఇండియన్ ఛాంపియన్ బుల్స్’కు స్వాగతం పలికారు. యాదవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిలో ప్రతి పండుగ పవిత్రమైనదని, దున్న రాజుల ప్రదర్శన అద్భుతమని కొనియాడారు. సమాజంలో ఐక్యత, సాంస్కృతిక గర్వాన్ని ఈ వేడుకలు ప్రదర్శిస్తాయన్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.

Similar News

News October 20, 2025

ఇతిహాసాలు క్విజ్ – 41 సమాధానాలు

image

1. దశరథుడి ప్రధాన మంత్రి పేరు ‘సుమంత్రుడు’.
2. నకుల, సహదేవుల తల్లి ‘మాద్రి’.
3. విష్ణువు నివాసం ఉండే లోకం పేరు ’వైకుంఠం’.
4. పంచాంగం అంటే ‘5’ ముఖ్యమైన అంశాల సమాహారం. అవి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం.
5. అన్నవరంలో కొలువై ఉన్న దేవుడు ‘సత్యనారాయణ స్వామి’.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 20, 2025

జుట్టు పెరగాలంటే హెయిర్ కట్ తప్పనిసరా?

image

జుట్టును కొద్దిగా కత్తిరించుకుంటే వేగంగా, ఆరోగ్యంగా పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ జుట్టు పెరగడానికి హెయిర్‌కట్‌కి సంబంధం లేదంటున్నారు నిపుణులు. కానీ జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి చివర్లు కత్తిరించడం మంచిదని సూచిస్తున్నారు. స్ప్లిట్ ఎండ్స్ వల్ల జుట్టు నిర్జీవంగా, గడ్డిలా తయారవుతుంది. కాబట్టి 3-4 నెలలకోసారి చివర్లు కత్తిరిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. <<-se>>#Haircare<<>>

News October 20, 2025

అరటిలో మాంగనీసు ధాతు లోపం – నివారణ

image

అరటి తోటలో మాంగనీసు ధాతులోపం వల్ల ముదురు ఆకులపై నిర్ణీత ఆకారం లేని పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత పసుపు రంగు మచ్చ మధ్యలో ఎండిపోతుంది. మాంగనీసు ధాతులోపం తీవ్రమైతే ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. పిలకల లేత ఆకులు, ఆకుమచ్చ చారలతో తెల్లగా మారి లోపం తీవ్రమైనప్పుడు ఎండిపోతాయి. లోప నివారణకు లీటరు నీటికి మాంగనీస్ సల్ఫేట్ 2 గ్రాములు కలిపి ఆకులన్నీ తడిచేలా 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి.