News October 20, 2025
ములుగు: ద్రోహులకు శిక్ష తప్పదు.. ‘మావో’ లేఖ

మావోయిస్టు పార్టీకి మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావు ముఠా వల్ల నమ్మకద్రోహం జరిగిందని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. వీరి మాయమాటలు నమ్మి కొందరు కామ్రేడ్స్ వీరి వెంట వెళ్లారని, వారంతా జీవితాలు ప్రశాంతంగా గడపాలన్నారు. విప్లవోద్యమ నష్టానికి కారకులైన మల్లోజుల, తక్కళ్లపల్లి ముఠాలకు శిక్ష తప్పదని, అమరుల త్యాగాల సాక్షిగా శపదం చేస్తున్నామన్నారు.
Similar News
News October 21, 2025
TODAY HEADLINES

☞ దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు
☞ INS విక్రాంత్ పాక్ను మోకాళ్లపై కూర్చోబెట్టింది: మోదీ
☞ TG: కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్
☞ AP: ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు
☞ రాష్ట్రాలు పోటీపడితేనే భారత్ గెలుస్తుంది: మంత్రి లోకేశ్
☞ కూటమి ప్రభుత్వ పాలనలో ఒక్క దీపమైనా వెలిగిందా: జగన్
News October 21, 2025
సరిహద్దుల్లో 120 మంది టెర్రరిస్టులు?.. ఆర్మీ హైఅలర్ట్

జమ్మూకశ్మీర్లో LoC వెంబడి ఇండియన్ ఆర్మీ హైఅలర్ట్ ప్రకటించింది. పాక్ దళాలు, జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద గ్రూపుల కార్యకలాపాలు పెరిగినట్లుగా గుర్తించింది. 120 మంది సాయుధ ఉగ్రవాదులు ఎల్వోసీ వెంబడి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని మల్టీ ఏజెన్సీల ద్వారా ఇన్పుట్స్ అందినట్లు సమాచారం. దీపావళి నేపథ్యంలో తాము పూర్తి అలర్ట్గా ఉన్నామని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
News October 21, 2025
155% టారిఫ్స్ విధిస్తా.. చైనాకు ట్రంప్ వార్నింగ్

చైనాపై 155% సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ‘సుంకాల రూపంలో చైనా నుంచి మనకు అపారమైన డబ్బు వస్తోంది. ప్రస్తుతం 55% చెల్లిస్తోంది. మనతో ఒప్పందం కుదుర్చుకోకపోతే నవంబర్ 1 నుంచి 155% చెల్లించాల్సి రావచ్చు’ అని హెచ్చరించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలకు ముందు ఆయన మాట్లాడారు. చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ను సౌత్ కొరియాలో కలవనున్నట్లు వెల్లడించారు.


