News October 20, 2025
కొయ్యూరు: 3 సార్లు జెడ్పీటీసీ.. ఒకసారి జెడ్పీ వైస్ చైర్మన్

కొయ్యూరు మండల జెడ్పీటీసీ వారా నూకరాజు సోమవారం రోలుగుంట మండలంలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. చిట్టెంపాడుకు చెందిన నూకరాజు ఒకసారి సీపీఐ తరపున, రెండుసార్లు వైసీపీ తరపున జెడ్పీటీసీగా గెలిచారు. 2001-06 మధ్యలో విశాఖ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గానూ పనిచేశారు. ఆయనకు కొంతకాలంగా ఛటర్జీపురం గ్రామానికి చెందిన భూముల విషయంలో వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి చంపేశారు.
Similar News
News October 21, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 21, మంగళవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.58 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.11 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.13 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.50 గంటలకు
✒ ఇష: రాత్రి 7.03 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 21, 2025
విశాఖ 572 మంది ఆర్టీసీ సిబ్బందికి ప్రమోషన్లు

విశాఖపట్నం ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందికి ప్రమోషన్లు మంజూరు కానున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 572 మందికి వివిధ కేటగిరీల్లో ప్రమోషన్లు సిద్ధం చేసినట్లు రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు 27, మెకానికల్ సూపర్వైజర్లు 113, ఏడీసీలు 115, కండక్టర్లు గ్రేడ్-1 130, డ్రైవర్లు గ్రేడ్-1 167 మంది ఉన్నారు.
News October 21, 2025
గంట వ్యవధిలోనే బాలుడి ఆచూకీ లభ్యం

అనంతపురంలోని హౌసింగ్ బోర్డులో రెండేళ్ల బాబు ఇంటి నుంచి బయటికి వచ్చి తప్పిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బ్లూ కోట్ పోలీసులు, ఓ కానిస్టేబుల్ ఆ బాలుడి ఆచూకీ కనుక్కున్నారు. వారి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. గంట వ్యవధిలోనే బాలుడి ఆచూకీ కనుగొన్న పోలీసులకు ఎస్పీ అభినందించారు.