News October 21, 2025

భగవద్గీతను ఎవరెందుకు చదవాలి?

image

మానవులందరికీ మార్గదర్శనం చేసే దివ్య గ్రంథం భగవద్గీత. ఉత్తమ జీవితం కోసం ప్రతి ఒక్కరూ గీతను అధ్యయనం చేయాలి. విద్యార్థులు క్రమశిక్షణ కోసం, యువకులు సరైన జీవన విధానం కోసం, వృద్ధులు మరణానంతర ఆలోచనల కోసం, అజ్ఞానులు జ్ఞానం కోసం, ధనవంతులు దయ అలవరుచుకోవడానికి, బలవంతులు దిశానిర్దేశం కోసం, కష్టాల్లో ఉన్నవారు పరిష్కారం కోసం భగవద్గీతను చదవాలి.
* రోజూ ఇలాంటి ఆసక్తికర కంటెంట్ కోసం <<-se_10013>>భక్తి<<>> క్లిక్ చేయండి.

Similar News

News October 21, 2025

రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్

image

రామగుండంలో 80O మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను త్వరలో ఏర్పాటు చేయాలని డిప్యూటీ CM భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లినట్లు MLA- MSరాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనను HYDలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి, దీపావళి పర్వదినం శుభాకాంక్షలు తెలియజేశారు. పాలకుర్తి మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి గ్రామాలకు తాగు నీరు, పంటలకు సాగునీరు అందివ్వాలని కోరారు.

News October 21, 2025

బొద్దింకను చంపబోయి మహిళ చావుకు కారణమైంది!

image

దక్షిణ కొరియాలో యువతి చేసిన పిచ్చి పని ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. ఒసాన్ నగరంలో తన ఇంట్లోకి వచ్చిన బొద్దింకను చంపేందుకు లైటర్, స్ప్రేను ఉపయోగించింది. ఈ క్రమంలో తన ఫ్లాట్‌కే నిప్పుపెట్టుకుంది. తర్వాత మంటలు మొత్తం అపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి. ఈ ఘటనలో పొరుగున ఉండే మహిళ చనిపోగా, ఆమె భర్త, 2 నెలల చిన్నారి ప్రాణాలతో బయటపడ్డారు. 30కిపైగా నివాసాలున్న బిల్డింగ్‌లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

News October 21, 2025

రేపట్నుంచి UAEలో చంద్రబాబు పర్యటన

image

AP: పెట్టుబడుల సాధన కోసం CM CBN రేపట్నుంచి 3 రోజుల పాటు UAEలో పర్యటించనున్నారు. తొలుత దుబాయ్‌లో CII నిర్వహించే రోడ్‌షోలో పాల్గొంటారు. శోభా, లోధా, షరాఫ్ డీజీ గ్రూపులు, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థల అధిపతులతో భేటీ అవుతారు. 24న AP NRT చేపట్టే తెలుగు డయాస్పోరా సదస్సుకు హాజరవుతారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులతోనూ CBN చర్చిస్తారు. NOV 14, 15 తేదీల్లో జరిగే VSP సమ్మిట్‌కు ఆయా సంస్థలను ఆహ్వానించనున్నారు.