News October 21, 2025

సైబర్ క్రైమ్ గ్యాంగ్ లీడర్.. కేరాఫ్ చాయ్‌వాలా

image

బిహార్‌లో అభిషేక్ కుమార్ అనే చాయ్‌వాలా అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ నెట్‌వర్క్ లీడర్‌గా తేలాడు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నో సైబర్ నేరాలకు పాల్పడిన అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అభిషేక్ ఇంట్లో సోదాలు చేపట్టి రూ.1.05 కోట్ల నగదు, 344గ్రా. గోల్డ్, 1.75KGs సిల్వర్ సీజ్ చేశారు. 85 ATM కార్డులు, 75 బ్యాంక్ పాస్‌బుక్స్, 28 చెక్‌బుక్స్, ఆధార్ కార్డ్స్, ల్యాప్‌టాప్స్, ఫోన్స్, లగ్జరీ కారు స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News October 21, 2025

పరిమితికి మించి నగదు లావాదేవీలు చేస్తున్నారా?.. జాగ్రత్త!

image

పరిమితికి మించి నగదు లావాదేవీలు చేస్తే తిప్పలు తప్పవని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. లిమిట్ దాటితే IT శాఖ నుంచి నోటీసులొస్తాయని, భారీ ఫైన్లు విధిస్తారని చెబుతున్నారు. ‘₹20 వేలకు మించి నగదును రుణంగా ఇవ్వకూడదు/తీసుకోకూడదు. ఒకేరోజు ₹2 లక్షలు/అంతకంటే ఎక్కువ నగదు తీసుకోడానికి పర్మిషన్ లేదు. వీటిపై 100% పెనాల్టీ విధించే చాన్స్ ఉంది’ అని అంటున్నారు. కొన్ని సందర్భాల్లోనే మినహాయింపు ఉంటుందంటున్నారు.

News October 21, 2025

కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు: సత్యకుమార్ యాదవ్

image

AP: కిడ్నీ రోగుల కోసం రాష్ట్రంలో కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. S.కోట, భీమవరం, పీలేరు ఏరియా ఆసుపత్రులలో, సీతంపేట, వెంకటగిరి, అద్దంకి, సున్నిపెంట సీహెచ్సీల్లో ఇవి ఏర్పాటవుతాయని వివరించారు. వీటిలో రోజూ 3 సెషన్లలో 15 మంది చొప్పున రోగులకు రక్తశుద్ధి జరుగుతుందన్నారు. PMNDP కింద ఒక్కో కేంద్రంలో ₹75 లక్షలతో యంత్రాలు, పరికరాలు సమకూరుతాయని తెలిపారు.

News October 21, 2025

బొద్దింకను చంపబోయి మహిళ చావుకు కారణమైంది!

image

దక్షిణ కొరియాలో యువతి చేసిన పిచ్చి పని ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. ఒసాన్ నగరంలో తన ఇంట్లోకి వచ్చిన బొద్దింకను చంపేందుకు లైటర్, స్ప్రేను ఉపయోగించింది. ఈ క్రమంలో తన ఫ్లాట్‌కే నిప్పుపెట్టుకుంది. తర్వాత మంటలు మొత్తం అపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి. ఈ ఘటనలో పొరుగున ఉండే మహిళ చనిపోగా, ఆమె భర్త, 2 నెలల చిన్నారి ప్రాణాలతో బయటపడ్డారు. 30కిపైగా నివాసాలున్న బిల్డింగ్‌లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.