News October 21, 2025

సూర్యాపేట ఘటనకు పదేళ్లు.. అమరులైన పోలీసులు

image

సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌ వద్ద 2015, ఏప్రిల్ 1న సిమీ ఉగ్రవాదులు పోలీసులపై జరిపిన కాల్పుల ఘటనకు నేటితో పదేళ్లు పూర్తవుతున్నాయి. ఈ దారుణంలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ మెట్టు లింగయ్య, హోంగార్డు మహేష్ అక్కడికక్కడే మృతి చెంది అమరులయ్యారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషాద ఘటనను జిల్లా పోలీసులు, ప్రజలు నేటికీ మరువలేక అమరుల త్యాగాన్ని స్మరించుకుంటున్నారు.

Similar News

News October 21, 2025

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపాలి: కలెక్టర్

image

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన అధ్యక్షతన ఒంగోలు క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక లభ్యత,‌ రవాణా, వర్షాకాలం దృష్ట్యా ముందుగానే ప్రజలకు అవసరమైన స్థాయిలో యార్డుల్లో అందుబాటులో ఉంచడం తదితర అంశాలను గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ కలెక్టర్‌కు వివరించారు.

News October 21, 2025

MHBD: ఉదయ్ నాగ్ అమరవీరుడై.. 17 ఏళ్లు!

image

MHBD జిల్లా మరిపెడ మండలానికి చెందిన గ్రేహౌండ్ పోలీస్ ఉదయ్ నాగ్ అమరవీరుడై 17 ఏళ్లు అయింది. అతి చిన్న వయసులో అతి కష్టమైన గ్రేహౌండ్స్ బలగాల్లో ఎంపికై మావోయిస్టులతో వీరోచిత పోరాటం చేశాడు. 2008 జూన్ 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లాలో కూంబింగ్ ముగిసిన అనంతరం బలగాలు బలిమెల వద్ద బోటులో ప్రయాణం అవుతుండగా మావోలు గ్రానైట్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఉదయ్ నాగ్‌తో సహా 75 మంది పోలీసులు అమరులయ్యారు.

News October 21, 2025

సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కడప జిల్లా వాసి

image

తొండూరు మండలం భద్రంపల్లెకు చెందిన ఈశ్వరయ్య సీపీఐ నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. గుజ్జుల ఈశ్వరయ్య ప్రాథమిక విద్య చదువుతుండగా.. విద్యార్థి ఉద్యమానికి ఆకర్షితుడై ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాను, రాష్ట్ర అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాతీయ ఉపాధ్యక్షునిగా సమస్యలపై, నిరుద్యోగ సమస్యపై సమస్యల పోరాటాలు నిర్వహించారు.