News October 21, 2025
సూర్యాపేట: సలాం పోలీసన్నా..!

విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరుల సేవలను స్మరించుకుంటూ నేడు(అక్టోబరు 21) పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు మొత్తం ఏడుగురు పోలీసులు విధి నిర్వహణలో అసువులు బాసారు. 2003లో చింతలపాలెం వద్ద నక్సల్స్ మందుపాతర దాడిలో ముగ్గురు, 2007లో తిరుమలగిరి దాడిలో ఇద్దరు, 2015లో హైటెక్ బస్టాండ్ ఘటనలో ఇద్దరు పోలీసులు అమరులయ్యారు.
Similar News
News October 21, 2025
మద్నూర్: రావి ఆకుపై పోలీసుల అమర వీరుల స్థూపం

మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయునిగా పని చేస్తున్న బాస బాల్ కిషన్ పోలీసుల అమర వీరుల దినోత్సవం సందర్భంగా రావి ఆకుపై అమర వీరుల స్థూపం చిత్రం వేశారు. శాంతి భద్రతలు కాపాడే ప్రయత్నంలో అమరులైన పోలీసులను మరువరాదని చిత్రం ద్వారా చూపిస్తూ నివాళి అర్పించారు. ఈ చిత్రం చూసిన పలువురు బాల్ కిషన్ను అభినందించారు.
News October 21, 2025
ఎమ్మార్వో, ఆర్ఐ అక్రమాలపై విచారణ- అనిరుధ్ రెడ్డి

ఉదండాపూర్ ప్రాజెక్టులో భాగంగా గతంలో భూసేకరణకు సంబంధించిన పరిహారం చెల్లింపులో అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై చర్యలు ఉంటాయని MLA అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. అప్పటి తాహశీల్దార్, ఆర్ఐ అక్రమాలపై ఫిర్యాదులను నేరుగా లేదా వాట్సాప్ నంబర్ 9392017899కు పంపించాలన్నారు. ప్రస్తుతం 23 మంది అక్రమార్కులకు నోటీసులు జారీ చేశామన్నారు. రూ.3.84 కోట్ల రికవరికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
News October 21, 2025
తరింపజేసే పంచమహామంత్రాలు

మనః అంటే మనసు, త్ర అంటే రక్షించేది. మనసును రక్షించేదే మంత్రం. ఇది దైవస్వరూపం. మంత్రం ఉచ్చరించినపుడు అందులో నాదబలం మనసును శాంతపరచి, ఆత్మను ఉన్నతస్థితికి తీసుకెళ్తుంది. పంచమహామంత్రాలివే..
1.ఓంనమఃశివాయ- పంచాక్షరీమంత్రం 2.ఓం నమో నారాయణాయ-అష్టాక్షరీమంత్రం 3.ఓం నమో భగవతే వాసుదేవాయ-ద్వాదశాక్షరీ మంత్రం, 4.ఓంభూర్భువఃస్వహ-గాయత్రీ మంత్రం, 5.ఓంత్రయంబకం యజామహే-మహామృత్యుంజయ మంత్రం.