News October 21, 2025
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: ఎస్పీ

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధుల్లో అమరులైన పోలీసులకు ఎస్పీ పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. అమరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
Similar News
News October 22, 2025
నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు నేటి నుంచి 3 రోజుల పాటు యూఏఈలో పర్యటించనున్నారు. ఇవాళ 10amకు హైదరాబాద్ నుంచి దుబాయ్ బయలుదేరుతారు. వచ్చే నెల 14-15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్కు వివిధ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా మూడు రోజుల్లో రోడ్ షోతో పాటు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ కానున్నారు.
News October 22, 2025
కార్తీకం: ప్రమిదల్లో ఎన్ని వత్తులు ఉండాలి?

కార్తీక మాసంలో ప్రమిదలో రెండు వత్తులను వెలిగిస్తే శాంతి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. 3 వత్తులు ధనవృద్ధినీ, నాలుగు ఐశ్వర్యాన్నీ, ఐదు అఖండ సంపదల్నీ, ఏడు మోక్షాన్నీ ప్రసాదిస్తాయంటున్నారు. మనలో ఉండే పంచతత్వాలకు నిదర్శనంగా 5 రుచులతో ఉండే ఉసిరికపైనా దీపాన్ని వెలిగించవచ్చని పేర్కొంటున్నారు. అయితే ఒక వత్తిని వెలిగించినా పుణ్యం లభిస్తుందని వివరిస్తున్నారు.
News October 22, 2025
అక్కన్నపేట: విద్యుత్ స్తంభమెక్కిన పొదలు

అక్కన్నపేట మండలం రామవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభంపై వెలుగుతున్న వీధి దీపానికి చెట్టు తీగ స్తంభం పైకి ఎక్కింది. వెలుతురును కనపించని విధంగా తీగ వీధి దీపం చుట్టూ అలుముకుంది. దీనిని చూసిన పలువురు విద్యుత్ దీపానికి కంచె మాదిరిగా ఉందంటూ సంభాషించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ వెలుతురుకు అడ్డుగా ఉన్న తీగను అధికారులు తొలగించాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.


