News October 21, 2025

శ్రీకాకుళం: అతని నేత్రాలు సజీవం

image

శ్రీకాకుళం నగరానికి చెందిన కే.కే. వి పురుషోత్తమరావు (కళ్యాణ్) మంగళవారం మృతి చెందారు. అతని నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకుని రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ జగన్మోహన్ రావుకు తెలియజేశారు. మగటపల్లి కళ్యాణి నేత్ర సేకరణ కేంద్రం ద్వారా ఆయన నేత్రాలను సేకరించి విశాఖపట్నంలో ఉన్న ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్‌కి అందజేశారు.

Similar News

News October 21, 2025

డీజే ఓ నిశ్శబ్ద హంతకి

image

పట్టణం, పల్లెలో డీజే శబ్దాలు హోరెత్తిస్తున్నాయి. శబ్ద తీవ్రత 50 డేసిబెల్స్ దాటితే మానవులకు గుండె సంబంధిత జబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నియమాలను నిర్వాహకులు పెడచెవిన పెట్టి పెద్ద శబ్దాలకు 100 డేసిబెల్స్‌ పెంచి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ నెల16న నరసన్నపేటలోని <<18018296>>భవానిపురంలో<<>> గౌరమ్మ ఊరేగింపులో డీజే శబ్దానికి భవనం కూలి పలువురు గాయపడిన సంగతి తెలిసిందే.

News October 21, 2025

శ్రీకాకుళం జిల్లాలోని ముఖ్య శైవ క్షేత్రాలు..!

image

రేపటి నుంచి కార్తీక మాసం మొదలుకానుంది. దీంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన శైవ క్షేత్రాలు ముస్తాబు కానున్నాయి. ముఖ్యంగా శ్రీముఖలింగేశ్వర దేవాలయం (జలుమూరు),
శ్రీ ఉత్తరేశ్వర స్వామి దేవాలయం (బలగ),
సంఘమేశ్వర ఆలయం(ఆమదాలవలస),
కోటేశ్వరస్వామి ఆలయం(శ్రీకాకుళం),
ఎండల మల్లికార్జున ఆలయం (రావివలస) క్షేత్రాలకు భక్తుల తాకిడి ఉండనుంది.

News October 21, 2025

కవిటి: ఆ గ్రామం ఆదర్శం..!

image

కవిటి (M) పొందూరు పుట్టుగ గ్రామం దీపావళి పండగకు దూరంగా ఉంది. కారణం ఏమిటంటే..? ఈ నెల 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు దూగాన రామ్మూర్తి (44), ప్రణయ్ (17) తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీపావళి నాడు బాధిత కుటుంబంలో అమావాస్య చీకట్లు అల్లుకున్నాయని గ్రామస్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు.