News October 21, 2025

సంగారెడ్డి: 24 నుంచి సమ్మేటివ్-1 పరీక్షలు

image

సంగారెడ్డి జిల్లాలోని 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈనెల 24 నుంచి 31 తేదీ వరకు సమ్మేటివ్-1 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు ఎమ్మార్సీ కార్యాలయంలో ఉన్నాయని చెప్పారు. ప్రధానోపాధ్యాయులు వాటిని పాఠశాలలకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు.

Similar News

News October 22, 2025

పత్తి కొనుగోళ్లకు సీసీఐ సిద్ధం.. రైతుల్లో నూతన ఆశలు.!

image

పల్నాడు జిల్లాలో పత్తి కొనుగోళ్ల కోసం సీసీఐ నెలాఖరులో 7 జిన్నింగ్ కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుంది. క్వింటాకు రూ. 8,110 మద్దతు ధర ప్రకటించింది. 12% కంటే ఎక్కువ తేమ ఉంటే కొనుగోలు చేయబోమని స్పష్టం చేసింది. ప్రస్తుత మార్కెట్ ధరలు రూ. 6,500- 7,000 మధ్య ఉండటంతో రైతులు సీసీఐపై ఆశలు పెట్టుకున్నారు. దళారుల బారిన పడకుండా ఇక్కడే అమ్ముకోవాలని అధికారులు సూచించారు.

News October 22, 2025

శివోహం.. అనంతపురం జిల్లాలో దర్శనీయ శివాలయాలు

image

నేటి నుంచి కార్తీకమాసం. ఈ నెలలో అనంతపురం జిల్లాలో దర్శనీయ ఆలయాలు ఎన్నో ఉన్నాయి.
★ తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర స్వామి
★ కూడేరు జోడి లింగాల క్షేత్రం
★ పామిడి భోగేశ్వర స్వామి
★ లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం
★ అమరాపురం సిద్దేశ్వర స్వామి, కంబదూరు మల్లేశ్వర స్వామి
★ గార్లదిన్నె కోటంక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
★ బుక్కరాయసముద్రం కాశీ విశ్వనాథ క్షేత్రం
★ తాడిమర్రి మండలంలో కాటి కోటేశ్వర స్వామి క్షేత్రం

News October 22, 2025

నేడు కామారెడ్డిలో జాబ్ మేళా

image

కామారెడ్డిలోని కలెక్టరేట్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లోని 21వ రూమ్‌లో బుధవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రజని కిరణ్ తెలిపారు. ప్రైవేటు కంపెనీలో సేల్స్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్స్ ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు. అభ్యర్థుల వయసు 30 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. మరిన్ని వివరాల కోసం 9885453222 నంబర్‌కు సంప్రదించాలన్నారు.